వెనుకబడిన వర్గాల నాయకుడిగా ఎదుగుతున్న తన మనోభావాలు దెబ్బతీసేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నానని మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు విజయవాడలో తెలిపారు. రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని అందులో భాగంగానే తనకు రాజధాని ప్రాంతంలో భూములున్నాయని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బినామీ భూములున్నాయనేది ఒక సాకుగా చూపి రాజధానిని తరలించాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఒక అడ్రస్ లేకుండా చేస్తున్నారని.... రాజధాని అమరావతి 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి, భవిష్యత్తుకు చిరునామా అని అన్నారు.
ఇదీ చదవండి:'రాజధాని రైతులకు మద్దతుగా మహిళలు బంగారం విరాళం'
ఇదీ చదవండి: