ETV Bharat / city

'ఆ మంత్రిపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నా'

author img

By

Published : Jan 6, 2020, 5:41 PM IST

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తనపై అసత్య ఆరోపణలు చేశారని భాజపా నాయకుడు రావెల కిషోర్ బాబు ఆరోపించారు. అందుకు మంత్రిపై పరువు నష్టం దావా వేస్తున్నానని వెల్లడించారు. రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని మండిపడ్డారు.

ravela kishore
రావెల కిషోర్
మంత్రిపై విమర్శలు చేస్తోన్న రావెల

వెనుకబడిన వర్గాల నాయకుడిగా ఎదుగుతున్న తన మనోభావాలు దెబ్బతీసేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నానని మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు విజయవాడలో తెలిపారు. రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని అందులో భాగంగానే తనకు రాజధాని ప్రాంతంలో భూములున్నాయని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బినామీ భూములున్నాయనేది ఒక సాకుగా చూపి రాజధానిని తరలించాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఒక అడ్రస్ లేకుండా చేస్తున్నారని.... రాజధాని అమరావతి 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి, భవిష్యత్తుకు చిరునామా అని అన్నారు.

మంత్రిపై విమర్శలు చేస్తోన్న రావెల

వెనుకబడిన వర్గాల నాయకుడిగా ఎదుగుతున్న తన మనోభావాలు దెబ్బతీసేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నానని మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు విజయవాడలో తెలిపారు. రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని అందులో భాగంగానే తనకు రాజధాని ప్రాంతంలో భూములున్నాయని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బినామీ భూములున్నాయనేది ఒక సాకుగా చూపి రాజధానిని తరలించాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఒక అడ్రస్ లేకుండా చేస్తున్నారని.... రాజధాని అమరావతి 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి, భవిష్యత్తుకు చిరునామా అని అన్నారు.

ఇదీ చదవండి:'రాజధాని రైతులకు మద్దతుగా మహిళలు బంగారం విరాళం'

ఇదీ చదవండి:

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.