ETV Bharat / city

ప్రకాశం బ్యారేజీ దిగువన మరో 2 బ్యారేజీలు

author img

By

Published : Sep 17, 2020, 7:47 PM IST

ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దశల వారీగా రెండు బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. చోడవరం వద్ద ఒకటి, బండికొళ్ల లంక వద్ద మరో బ్యారేజీ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం .. నిధుల ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రకాశం బ్యారేజీ దిగువన 2 కొత్త బ్యారేజీలు
ప్రకాశం బ్యారేజీ దిగువన 2 కొత్త బ్యారేజీలు

కృష్ణా నది నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం వద్ద ఒక బ్యారేజీని, బండికొళ్లలంక వద్ద మరో బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయించారు. ఈమేరకు పరిపాలనా అనుమతుల్ని ప్రభుత్వం జారీ చేసింది. దశలవారీగా ఈ బ్యారేజీలను నిర్మించనున్నారు.

తొలిదశలో రెండు బ్యారేజీలకు 204.37 కోట్ల రూపాయల మేర పరిపాలనా అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. చోడవరం - రామచంద్రాపురం వద్ద బ్యారేజీ నిర్మాణంలో తొలి దశకు 102.17 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు కేటాయించారు. అలాగే బండికోళ్లంక - రావి అనంతవరం వద్ద మరో బ్యారేజీ నిర్మాణంలో తొలి దశ కోసం మరో 102.20 కోట్ల కేటాయిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే, భూ సేకరణ, పర్యావరణ పరిస్థితుల అధ్యయనం ఈ మొత్తాలను వెచ్చించనున్నారు.

ప్రత్యేకించి భూసేకరణ నిమిత్తం ఒక్కో బ్యారేజీకి రూ.100 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ప్రకాశం బ్యారేజీ దిగువన నిర్మించే ఈ రెండు బ్యారేజీలలోనూ కనీస మొత్తంగా మూడేసి టీఎంసీల చొప్పున మొత్తంగా ఆరు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు.

ఇదీ చదవండి : 'విస్తృత పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యం'

కృష్ణా నది నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం వద్ద ఒక బ్యారేజీని, బండికొళ్లలంక వద్ద మరో బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయించారు. ఈమేరకు పరిపాలనా అనుమతుల్ని ప్రభుత్వం జారీ చేసింది. దశలవారీగా ఈ బ్యారేజీలను నిర్మించనున్నారు.

తొలిదశలో రెండు బ్యారేజీలకు 204.37 కోట్ల రూపాయల మేర పరిపాలనా అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. చోడవరం - రామచంద్రాపురం వద్ద బ్యారేజీ నిర్మాణంలో తొలి దశకు 102.17 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు కేటాయించారు. అలాగే బండికోళ్లంక - రావి అనంతవరం వద్ద మరో బ్యారేజీ నిర్మాణంలో తొలి దశ కోసం మరో 102.20 కోట్ల కేటాయిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే, భూ సేకరణ, పర్యావరణ పరిస్థితుల అధ్యయనం ఈ మొత్తాలను వెచ్చించనున్నారు.

ప్రత్యేకించి భూసేకరణ నిమిత్తం ఒక్కో బ్యారేజీకి రూ.100 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ప్రకాశం బ్యారేజీ దిగువన నిర్మించే ఈ రెండు బ్యారేజీలలోనూ కనీస మొత్తంగా మూడేసి టీఎంసీల చొప్పున మొత్తంగా ఆరు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు.

ఇదీ చదవండి : 'విస్తృత పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.