బాలల దినోత్సవం, దీపావళిని పురస్కరించుకుని విజయవాడలోని అమృతహస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుస్తులు, గులాబీలు, బాణసంచా పంచారు. సిక్కుల కాలనీలోని పేదలకు ఆహారం సరఫరా చేశారు. ఇళ్లలో నిరుపయోగంగా వదిలేసిన వస్త్రాలను సేకరించి- మంచి వాటిని చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందజేశారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం మాస్కులు ధరించాలని- అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు పరిశుభ్రత పాటిస్తూ మంచి అలవాట్లు చేసుకోవాలని పిల్లలకు సూచించారు.
ఇదీ చదవండి