ETV Bharat / city

కొవిడ్ చికిత్సకు అనుమతులు తీసుకోండి.. లేదంటే కఠిన చర్యలే: సింఘాల్

author img

By

Published : May 2, 2021, 9:26 PM IST

రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు కొవిడ్ చికిత్స చేసేందుకు అనుమతులు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వైద్యం అందిస్తే తీవ్రంగా స్పందిస్తామని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కొవిడ్ చికిత్సకు అనుమతులు తీసుకోండి.. లేదంటే కఠిన చర్యలే : సింఘాల్
కొవిడ్ చికిత్సకు అనుమతులు తీసుకోండి.. లేదంటే కఠిన చర్యలే : సింఘాల్

అనుమతులు తీసుకోకుండా కొన్ని ఆస్పత్రుల యాజమాన్యం కొవిడ్ చికిత్సలు నిర్వహించడాన్ని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తీవ్రంగా ఖండించారు. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా కరోనాకు చికిత్స అందించే ప్రైవేట్, కార్పొరేట్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు.

దరఖాస్తు చేస్తే 24 గంటల్లోనే అనుమతి..

ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ చికిత్స నిర్వహణ కోసం దరఖాస్తు చేస్తే 24 గంటల్లోనే ప్రభుత్వం అనుమతిస్తుందని పేర్కొన్నారు. ఆక్సిజన్ నిల్వలు, మందుల వంటి అత్యవసరాల కొనుగోలుకు సీనియర్ అధికారులతో కూడిన కమిటీని నియమించిన సర్కార్ తగిన ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రోజూ వారీగా విడుదల చేసే కరోనా బులిటిన్​లో మృతుల సంఖ్య సహా ఇతర వివరాలన్నింటినీ వాస్తవంగానే ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మృతుల వివరాలను ప్రభుత్వం దాచి ఉంచడం లేదని స్పష్టం చేశారు.

'సామర్థ్యం మేరకే చేర్చుకోవాలి'

పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆక్సిజన్ కోటాను సైతం పెంచాలని కేంద్ర కమిటీని కోరతామన్నారు. కార్పొరేట్ సహా ప్రైవేట్ యాజమన్యాలు తమ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వల కెపాసిటీ మేరకే రోగులను చేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నట్లు తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ బెడ్స్, సాధారణ పడకల లభ్యత తగ్గుతూ వస్తోందని వివరించారు.

'కొరత లేకుండా చర్యలు'

మొత్తంగా.. 81 కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సుమారు 27 వేల 615 రెమిడిసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రాణవాయువు కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రొక్యూర్​మెంట్ కమిటీలు ఏర్పాటు..

104కి ఫోన్ల తాకిడి పెరిగిందని, శనివారం ఒక్క రోజే సుమారు 13 వేల కాల్స్ వచ్చాయని.. ఆదివారం సంఖ్య 17 వేలకుపైగా చేరిందన్నారు. గత ఏడాది 18 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తీసుకోగా.. ఈ ఏడాది 16 వేల 18 మందికి ఇప్పటికే నియామక పత్రాలను ఇచ్చామన్నారు. ఆక్సిజన్ పరికరాలు కొనుగోలుకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగిందని, పరికరాల కొనుగోలు కోసమే ప్రొక్యూర్​మెంట్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:

పోరాటాలే మమత విజయానికి బాటలు

అనుమతులు తీసుకోకుండా కొన్ని ఆస్పత్రుల యాజమాన్యం కొవిడ్ చికిత్సలు నిర్వహించడాన్ని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తీవ్రంగా ఖండించారు. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా కరోనాకు చికిత్స అందించే ప్రైవేట్, కార్పొరేట్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు.

దరఖాస్తు చేస్తే 24 గంటల్లోనే అనుమతి..

ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ చికిత్స నిర్వహణ కోసం దరఖాస్తు చేస్తే 24 గంటల్లోనే ప్రభుత్వం అనుమతిస్తుందని పేర్కొన్నారు. ఆక్సిజన్ నిల్వలు, మందుల వంటి అత్యవసరాల కొనుగోలుకు సీనియర్ అధికారులతో కూడిన కమిటీని నియమించిన సర్కార్ తగిన ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రోజూ వారీగా విడుదల చేసే కరోనా బులిటిన్​లో మృతుల సంఖ్య సహా ఇతర వివరాలన్నింటినీ వాస్తవంగానే ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మృతుల వివరాలను ప్రభుత్వం దాచి ఉంచడం లేదని స్పష్టం చేశారు.

'సామర్థ్యం మేరకే చేర్చుకోవాలి'

పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆక్సిజన్ కోటాను సైతం పెంచాలని కేంద్ర కమిటీని కోరతామన్నారు. కార్పొరేట్ సహా ప్రైవేట్ యాజమన్యాలు తమ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వల కెపాసిటీ మేరకే రోగులను చేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నట్లు తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ బెడ్స్, సాధారణ పడకల లభ్యత తగ్గుతూ వస్తోందని వివరించారు.

'కొరత లేకుండా చర్యలు'

మొత్తంగా.. 81 కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సుమారు 27 వేల 615 రెమిడిసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రాణవాయువు కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రొక్యూర్​మెంట్ కమిటీలు ఏర్పాటు..

104కి ఫోన్ల తాకిడి పెరిగిందని, శనివారం ఒక్క రోజే సుమారు 13 వేల కాల్స్ వచ్చాయని.. ఆదివారం సంఖ్య 17 వేలకుపైగా చేరిందన్నారు. గత ఏడాది 18 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తీసుకోగా.. ఈ ఏడాది 16 వేల 18 మందికి ఇప్పటికే నియామక పత్రాలను ఇచ్చామన్నారు. ఆక్సిజన్ పరికరాలు కొనుగోలుకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగిందని, పరికరాల కొనుగోలు కోసమే ప్రొక్యూర్​మెంట్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:

పోరాటాలే మమత విజయానికి బాటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.