ETV Bharat / city

రాష్ట్రంలో మళ్లీ 3 వేలు దాటిన కరోనా కేసులు.. 12 మంది మృతి

author img

By

Published : Apr 10, 2021, 7:05 PM IST

new corona cases
new corona cases

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 3,309 కరోనా కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి.

కరోనా రోజురోజుకు మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల్లో 3,309 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా..అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 1,053 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 18,666 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 31,929 మందికి కరోనా పరీక్షలు చేశారు.

కొత్తగా 3,309 కరోనా కేసులు
కొత్తగా 3,309 కరోనా కేసులు

ఇదీ చదవండి: నిండుకుంటున్న టీకా నిల్వలు- పంపిణీకి బ్రేకులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.