సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ను వైకాపా నేతలు కలిశారు. తిరుపతి ఉప ఎన్నికలో భాగంగా సోషల్ మీడియా వేదికగా తమ పార్టీపై తెలుగుదేశం తప్పుడు ప్రచారం చేస్తుందని ఫిర్యాదు చేశారు. కృష్ణపట్నం నుంచి సత్యవేడు వరకు ఉన్న భూములను సెజ్ కోసం లాక్కుంటారంటూ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డిలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సెజ్ కోసం భూములు లాక్కుంటారని గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో తెదేపా చేస్తున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీచదవండి