Naga Chaitanya Multi Starer : అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి లీడ్ రోల్స్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'తండేల్'. యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న వరల్డ్వైడ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్లో జోరు పెంచారు. తాజాగా మూవీటీమ్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో పలు చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
'మీ తమ్ముడు అఖిల్, అల్లు అర్జున్ అవకాశం వస్తే ఈ ఇద్దరిలో ఎవరితో మల్టీస్టారర్ చేస్తారు?' అని అడిగారు. దీనికి అఖిల్తో కలిసి 'మనం' సినిమాలో కనిపించామని చైతూ తెలిపారు. అందుకే అల్లు అర్జున్తో మల్టీస్టారర్ చేస్తానని ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం చైతూ కామెంట్స్ సోషల్ మీడియా ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. చైతూ ఫ్యాన్స్, బన్నీ అభిమానులు తెగ స్పందిస్తున్నారు. మల్టీస్టారర్ కోసం వెయిటింగ్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఏ డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేస్తారోనని డిస్కస్ చేసుకుంటున్నారు.
చీఫ్ గెస్ట్గా బన్నీ
ఫిబ్రవరి 2 (ఆదివారం)న హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా రానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో అల్లు, అక్కినేని అభిమానులకు బన్నీ, చైతూను ఒకే స్టేజ్పై చూసే ఛాన్స్ వచ్చింది.
చైతూ మల్టీస్టారర్స్
కాగా, మల్టీ స్టారర్ సినిమాల్లో నటించడం నాగచైతన్యకు కొత్తేం కాదు. ఆయన ఇప్పటికే విక్టరీ వెంకటేశ్తో 'వెంకీ మామ', బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్తో 'లాల్ సింగ్ చద్దా' సినిమాల్లో నటించారు.
ఇక సినిమా విషయానికొస్తే, పాన్ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. గతంలో ఎన్నడూ చేయని సరి కొత్త పాత్రలో చైతూ, డీగ్లామర్ లుక్స్లో సాయి పల్లవి కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు ఈ చిత్రానికి చక్కటి స్వరాలు అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించారు.
'ఆ ఒక్క సీక్వెన్స్కే రూ.18కోట్లు ఖర్చు అయింది' - 'తండేల్' డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈసారి గురుచూసి కొడుతున్న 'తండేల్'! రిలీజ్ డేట్ వచ్చేసిందబ్బా- ఎప్పుడంటే?