ETV Bharat / city

ttd: ఆర్టీసీ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు

ఏపీఎస్​ఆర్టీసీ ద్వారా ఇక నుంచి తిరుమల శ్రీవారి టికెట్లు పొందవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఛార్జీలతోపాటు రూ.300 అదనంగా చెల్లించి శీఘ్రదర్శనం టికెట్టు పొందె అవకాశం కల్పిస్తుంది.

author img

By

Published : Jul 18, 2021, 8:36 AM IST

Updated : Jul 18, 2021, 12:13 PM IST

ttd tickets and hundi collections
ttd tickets and hundi collections

తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ కల్పిస్తోంది. ఇందుకోసం ప్రతి రోజు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంచుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఛార్జీలతోపాటు రూ.300 అదనంగా చెల్లించి శీఘ్రదర్శనం టికెట్టు పొందొచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు ఉదయం 11 గంటలు, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న 18,195 మంది భక్తులు..

శ్రీవారిని శనివారం 18,195 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. 7,754 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని... శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.24 కోట్లు సమకూరిందని వెల్లడించారు.

తిరుమల శ్రీవారిని శివసేన ప్రధాన కార్యదర్శి మిలింద్ నవరేకర్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: ttd: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ కల్పిస్తోంది. ఇందుకోసం ప్రతి రోజు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంచుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఛార్జీలతోపాటు రూ.300 అదనంగా చెల్లించి శీఘ్రదర్శనం టికెట్టు పొందొచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు ఉదయం 11 గంటలు, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న 18,195 మంది భక్తులు..

శ్రీవారిని శనివారం 18,195 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. 7,754 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని... శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.24 కోట్లు సమకూరిందని వెల్లడించారు.

తిరుమల శ్రీవారిని శివసేన ప్రధాన కార్యదర్శి మిలింద్ నవరేకర్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: ttd: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Last Updated : Jul 18, 2021, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.