ETV Bharat / city

శ్రీవారి దర్శన టికెట్లు పెంచుతున్న తితిదే

author img

By

Published : Jun 26, 2020, 2:03 PM IST

Updated : Jun 26, 2020, 3:24 PM IST

తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజుకు 3 వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను ఆన్​లైన్​లో జారీచేస్తున్న తితిదే... మరో ఆరు వేల టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. తిరుపతిలో నేరుగా వచ్చిన భక్తుల కోసం 3750 సర్వదర్శన టికెట్లను జారీచేస్తోంది. సర్వదర్శన టికెట్ల కోసం చిత్తూరు, కర్నూలు, అనంతపురం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీవారి దర్శన టికెట్ల కోసం తరలివచ్చిన భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో... ఈ నెల 30 వరకు సర్వదర్శనం టికెట్లు జారీచేయాలని తితిదే నిర్ణయించింది.

శ్రీవారి దర్శన టికెట్లు పెంచుతున్న తితిదే... ఆఫ్​లైన్​లోనూ టోకెన్లు
శ్రీవారి దర్శన టికెట్లు పెంచుతున్న తితిదే... ఆఫ్​లైన్​లోనూ టోకెన్లు
శ్రీవారి దర్శన టికెట్లు పెంచుతున్న తితిదే

కలియుగ వైకుంఠనాథుడు... తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న తితిదే... క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది. ఈ నెల 11వ తేదీన పరిమిత సంఖ్యలో సాధారణ భక్తులను దర్శనాలకు అనుమతించిన ప్రభుత్వం... వారి సంఖ్యను పెంచింది. తొలి వారంలో సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా రోజుకు మూడు వేల మందికి స్వామి దర్శనానికి తితిదే అనుమతించింది. తర్వాత సంఖ్యను పెంచింది. ఈ నెల 19 నుంచి ఆన్‌లైన్‌లో జారీ చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను ఆరు వేలకు పెంచింది.

ఈ నెల 30 వరకూ టికెట్లు...

శుక్రవారం నుంచి మరో మూడు వేలు అదనంగా జారీచేయడంతో ఆన్‌లైన్‌ టికెట్ల సంఖ్య తొమ్మిది వేలకు చేరింది. మరో వైపు నేరుగా తిరుపతి వచ్చిన వారి కోసం 3750 సర్వదర్శన టికెట్లు జారీ చేసింది. సర్వ దర్శన టోకెన్ల కోసం స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో పదకొండో తేదీ నుంచి మూడు రోజుల పాటు టికెట్లు(ఈ నెల 26 వరకు) ఇచ్చింది. తిరిగి రెండో విడత ఈ నెల 30 వరకు దర్శనం చేసుకొనేందుకు వీలుగా సర్వ దర్శన టోకెన్లను ఇవాళ్టి నుంచి జారీ చేస్తోంది. సర్వదర్శన టోకెన్ల జారీ తిరిగి ప్రారంభమవడంతో భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలోకి చేరుకొని సర్వదర్శన టోకెన్లు తీసుకుంటున్నారు.

అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం తరలివచ్చారు. స్థానికులు, ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో వేచిఉన్నారు.

విరాళం ఇచ్చిన భక్తులకు విరామ సమయ దర్శనం ...

సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ప్రారంభించిన తితిదే... శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా పదివేల రూపాయలు చెల్లించే భక్తులకు విరామ సమయ దర్శనాలకు ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు గంట పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖుల కోసం కేటాయించిన సమయంలోనే శ్రీవాణి ట్రస్టు విరాళాలు అందచేసిన భక్తులను దర్శనాలకు అనుమతిస్తోంది.

ఇదీ చదవండి : సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం... పోలవరం గేట్లు ఇప్పుడా? : దేవినేని ఉమా

శ్రీవారి దర్శన టికెట్లు పెంచుతున్న తితిదే

కలియుగ వైకుంఠనాథుడు... తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న తితిదే... క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది. ఈ నెల 11వ తేదీన పరిమిత సంఖ్యలో సాధారణ భక్తులను దర్శనాలకు అనుమతించిన ప్రభుత్వం... వారి సంఖ్యను పెంచింది. తొలి వారంలో సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా రోజుకు మూడు వేల మందికి స్వామి దర్శనానికి తితిదే అనుమతించింది. తర్వాత సంఖ్యను పెంచింది. ఈ నెల 19 నుంచి ఆన్‌లైన్‌లో జారీ చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను ఆరు వేలకు పెంచింది.

ఈ నెల 30 వరకూ టికెట్లు...

శుక్రవారం నుంచి మరో మూడు వేలు అదనంగా జారీచేయడంతో ఆన్‌లైన్‌ టికెట్ల సంఖ్య తొమ్మిది వేలకు చేరింది. మరో వైపు నేరుగా తిరుపతి వచ్చిన వారి కోసం 3750 సర్వదర్శన టికెట్లు జారీ చేసింది. సర్వ దర్శన టోకెన్ల కోసం స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో పదకొండో తేదీ నుంచి మూడు రోజుల పాటు టికెట్లు(ఈ నెల 26 వరకు) ఇచ్చింది. తిరిగి రెండో విడత ఈ నెల 30 వరకు దర్శనం చేసుకొనేందుకు వీలుగా సర్వ దర్శన టోకెన్లను ఇవాళ్టి నుంచి జారీ చేస్తోంది. సర్వదర్శన టోకెన్ల జారీ తిరిగి ప్రారంభమవడంతో భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలోకి చేరుకొని సర్వదర్శన టోకెన్లు తీసుకుంటున్నారు.

అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం తరలివచ్చారు. స్థానికులు, ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో వేచిఉన్నారు.

విరాళం ఇచ్చిన భక్తులకు విరామ సమయ దర్శనం ...

సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ప్రారంభించిన తితిదే... శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా పదివేల రూపాయలు చెల్లించే భక్తులకు విరామ సమయ దర్శనాలకు ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు గంట పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖుల కోసం కేటాయించిన సమయంలోనే శ్రీవాణి ట్రస్టు విరాళాలు అందచేసిన భక్తులను దర్శనాలకు అనుమతిస్తోంది.

ఇదీ చదవండి : సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం... పోలవరం గేట్లు ఇప్పుడా? : దేవినేని ఉమా

Last Updated : Jun 26, 2020, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.