ETV Bharat / city

తిరుమలలో వారం పాటు దర్శనం నిలిపివేత

author img

By

Published : Mar 19, 2020, 6:18 PM IST

Updated : Mar 19, 2020, 7:39 PM IST

వారంరోజుల పాటు తిరుమలలో దర్శనం నిలిపివేస్తున్నామని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే తిరుపతి చేరుకుని టైమ్​స్లాట్ టోకెన్లు తీసుకున్నవారికి ఈరోజు రాత్రి దర్శనం కల్పించి.. అనంతరం దర్శనాలు నిలిపివేస్తామని చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుడికి కరోనా లక్షణాలు కనిపించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

tirumala-temple-vision-stop-due-to-corona
తిరుమలలో వారం పాటు దర్శనం నిలిపివేత

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం నిలిపివేశారు. ప్రస్తుతానికి వారంరోజులపాటు భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుడికి కరోనా లక్షణాలు కనిపించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

" ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్​కి చెందిన దయాశంకర్ అనే వ్యక్తి.. తన గ్రామానికి చెందిన 110 మందితో తిరుమలకు వచ్చాడు. అతను 20 ఏళ్ల నుంచి సీవోపీడీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక్కడికి వచ్చాక అతనికి తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించాయి. వెంటనే అతడికి ఐసోలేషన్​ వార్డులో చికిత్స చేశాం. అనంతరం అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించాం. ఆ ఫలితాలు వచ్చాక అందరితో చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. ముందుజాగ్రత్తగా అతనితోపాటు వచ్చిన 110 మందిని ఐసోలేషన్​లో ఉంచాం. వారు ఎవరెవరిని కలిశారో వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా'మని ఈవో అనిల్ తెలిపారు.

"ఆ భక్తునికి కరోనా లక్షణాలు కనిపించిన కారణంగా వారంపాటు దర్శనం నిలిపివేయాలని నిర్ణయించాం. అయితే ఇప్పటికే తిరుపతి చేరుకుని టైమ్​స్లాట్ టోకెన్లు తీసుకున్నవారికి మాత్రం ఈ రాత్రికి దర్శనం కల్పిస్తాం. అనంతరం నిలిపివేస్తాం. ఘాట్​రోడ్లు, కల్యాణకట్ట అన్నీ మూసివేశాం. అయితే స్వామివారికి జరగాల్సిన కైంకర్యాలన్నీ అర్చకులు ఏకాంతంలో నిర్వహిస్తారు. తిరుమలే కాకుండా పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజుల ఆలయంలో కూడా దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించాం. ఈ నిర్ణయానికి భక్తులందరూ సహకరించాలి. ఈనెల 22 నుంచి ఒంటిమిట్టలో జరగాల్సిన కోదండరామాలయం ఉత్సవాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం'మని తితిదే ఈవో అనిల్ కుమార్ తెలిపారు.

తిరుమలలో వారం పాటు దర్శనం నిలిపివేత

ఇవీ చదవండి:

తిరుమలలో భక్తునికి కరోనా లక్షణాలు..?

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం నిలిపివేశారు. ప్రస్తుతానికి వారంరోజులపాటు భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుడికి కరోనా లక్షణాలు కనిపించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

" ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్​కి చెందిన దయాశంకర్ అనే వ్యక్తి.. తన గ్రామానికి చెందిన 110 మందితో తిరుమలకు వచ్చాడు. అతను 20 ఏళ్ల నుంచి సీవోపీడీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక్కడికి వచ్చాక అతనికి తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించాయి. వెంటనే అతడికి ఐసోలేషన్​ వార్డులో చికిత్స చేశాం. అనంతరం అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించాం. ఆ ఫలితాలు వచ్చాక అందరితో చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. ముందుజాగ్రత్తగా అతనితోపాటు వచ్చిన 110 మందిని ఐసోలేషన్​లో ఉంచాం. వారు ఎవరెవరిని కలిశారో వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా'మని ఈవో అనిల్ తెలిపారు.

"ఆ భక్తునికి కరోనా లక్షణాలు కనిపించిన కారణంగా వారంపాటు దర్శనం నిలిపివేయాలని నిర్ణయించాం. అయితే ఇప్పటికే తిరుపతి చేరుకుని టైమ్​స్లాట్ టోకెన్లు తీసుకున్నవారికి మాత్రం ఈ రాత్రికి దర్శనం కల్పిస్తాం. అనంతరం నిలిపివేస్తాం. ఘాట్​రోడ్లు, కల్యాణకట్ట అన్నీ మూసివేశాం. అయితే స్వామివారికి జరగాల్సిన కైంకర్యాలన్నీ అర్చకులు ఏకాంతంలో నిర్వహిస్తారు. తిరుమలే కాకుండా పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజుల ఆలయంలో కూడా దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించాం. ఈ నిర్ణయానికి భక్తులందరూ సహకరించాలి. ఈనెల 22 నుంచి ఒంటిమిట్టలో జరగాల్సిన కోదండరామాలయం ఉత్సవాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం'మని తితిదే ఈవో అనిల్ కుమార్ తెలిపారు.

తిరుమలలో వారం పాటు దర్శనం నిలిపివేత

ఇవీ చదవండి:

తిరుమలలో భక్తునికి కరోనా లక్షణాలు..?

Last Updated : Mar 19, 2020, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.