ETV Bharat / city

కోళ్ల లారీ, కారు ఢీ.. ఇద్దరు మృతి

author img

By

Published : May 19, 2021, 9:30 AM IST

తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిలోని భాకరాపేట - కనుమదారిలో లారీ కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.

road accident at chittoor district
లారీ, కారు ఢీ.. ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిలోని.. భాకరాపేట - కనుమ దారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మదనపల్లి వైపు ప్రయాణిస్తున్న కారు.. పీలేరు నుంచి తిరుపతి వైపుగా వెళుతున్న కోళ్ల లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

కారు డ్రైవర్ పార్థసారథి అక్కడికక్కడే మృతి చెందగా.. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ భారతి అనే మహిళ మృతి చెందింది. మృతులను వెదురుకుప్పం మండలం గంటావారి పల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. లారీలో ఉన్న కోళ్లను అటుగా వేల్లే వాహనచోదకులు పోటీలు పడి తీసుకెళ్లారు. ఘటనపై.. చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిలోని.. భాకరాపేట - కనుమ దారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మదనపల్లి వైపు ప్రయాణిస్తున్న కారు.. పీలేరు నుంచి తిరుపతి వైపుగా వెళుతున్న కోళ్ల లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

కారు డ్రైవర్ పార్థసారథి అక్కడికక్కడే మృతి చెందగా.. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ భారతి అనే మహిళ మృతి చెందింది. మృతులను వెదురుకుప్పం మండలం గంటావారి పల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. లారీలో ఉన్న కోళ్లను అటుగా వేల్లే వాహనచోదకులు పోటీలు పడి తీసుకెళ్లారు. ఘటనపై.. చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

కశ్మీర్​లో పాక్​ చొరబాటుదారుడి అరెస్ట్​

చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సంచలన నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.