ETV Bharat / city

తిరుపతి బాలుడి కిడ్నాప్ కేసు: అనుమానితుడి ఊహాచిత్రం విడుదల

author img

By

Published : Mar 5, 2021, 9:44 PM IST

తిరుపతి బాలుడి కిడ్నాప్ కేసులో అనుమానితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. బాలుడి సమాచారం తెలిస్తే తిరుపతి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ 80999 99977 నెంబర్​కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కాగా..ఫిబ్రవరి 27న ఛత్తీస్​గడ్ నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన బాలుడు కిడ్నాప్​న​కు గురైన సంగతి తెలిసిందే.

తిరుపతి బాలుడి కిడ్నాప్ కేసు
తిరుపతి బాలుడి కిడ్నాప్ కేసు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఛత్తీస్​గడ్ నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన బాలుడు శివం కుమార్ సాహు ఫిబ్రవరి 27న అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఛత్తీస్​గడ్ నుంచి వచ్చిన కుటుంబం అలిపిరి బాలాజీ బస్టాండ్​లో సేదతీరుతుండగా బాలుడు అపహరణకు గురయ్యాడు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితుడి ఊహా చిత్రాన్ని ఇవాళ పోలీసులు విడుదల చేశారు. బాలుడి సమాచారం తెలిస్తే తిరుపతి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ 80999 99977 నెంబర్​కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. బాలుడి ఆచూకీ కోసం తిరుపతి అర్బన్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఛత్తీస్​గడ్ నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన బాలుడు శివం కుమార్ సాహు ఫిబ్రవరి 27న అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. ఛత్తీస్​గడ్ నుంచి వచ్చిన కుటుంబం అలిపిరి బాలాజీ బస్టాండ్​లో సేదతీరుతుండగా బాలుడు అపహరణకు గురయ్యాడు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితుడి ఊహా చిత్రాన్ని ఇవాళ పోలీసులు విడుదల చేశారు. బాలుడి సమాచారం తెలిస్తే తిరుపతి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ 80999 99977 నెంబర్​కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. బాలుడి ఆచూకీ కోసం తిరుపతి అర్బన్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

ఇదీచదవండి

నెల్లూరు జిల్లాలో ముగ్గురు బాలికలు అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.