తిరుమలలో నెల్లూరుకు చెందిన జ్ఞాన సుందరం అనే దివ్యాంగుడు కొన్ని విజిటింగ్ కార్డులతోపాటు.. రసీదు పుస్తకాలతో కనిపించాడు. అతని వద్ద ఉన్న విజిటింగ్ కార్డులపై అన్ని మతాలకు చెందిన గుర్తులు ఉండడంతో..అన్యమత ప్రచారం చేస్తున్నాడని స్థానికులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సుందరాన్ని విచారించిన తితిదే విజిలెన్స్ సిబ్బంది.... భక్తుల నుంచి ట్రస్టు చందాల కోసం మాత్రమే ప్రయత్నించినట్లు తెలుసుకున్నారు. అన్యమత ప్రచారం చేయలేదని... సుందరం డిజేబుల్ ఛారిటబుల్ ట్రస్టు కోసం ప్రయత్నించాడని ఏవీఎస్వో వీరబాబు తెలిపారు. అతని వద్ద లిఖిత పూర్వకంగా వివరణ తీసుకుని విడిచిపెట్టామన్నారు.
ఇదీ చదవండి: '19 నెలలుగా అంధకారంలో రాష్ట్రం... ప్రజలను యువత చైతన్యపరచాలి'