ETV Bharat / city

రామతీర్థం ఘటనపై అవసరమైతే సీబీఐ విచారణ: మంత్రి అప్పలరాజు

author img

By

Published : Jan 5, 2021, 7:36 PM IST

రామతీర్థం ఘటనపై అవసరమైతే సీబీఐ విచారణ కోరుతామని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

minister sidiri appalaraju
minister sidiri appalaraju

రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి సిదిరి అప్పలరాజు ఆరోపించారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటన పై అవసరమైతే సీబీఐ విచారణ కోరుతామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో చంద్రబాబు ఇంకా ఎన్ని కుట్రలు చేయాలని అనుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కొందరు కావాలని కుల, మత విబేధాలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే తెదేపా నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయవద్దంటూ చంద్రబాబు కోర్టులో పిటిషన్ వేస్తారని అనుమానంగా ఉందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి సిదిరి అప్పలరాజు ఆరోపించారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటన పై అవసరమైతే సీబీఐ విచారణ కోరుతామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో చంద్రబాబు ఇంకా ఎన్ని కుట్రలు చేయాలని అనుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కొందరు కావాలని కుల, మత విబేధాలను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే తెదేపా నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేయవద్దంటూ చంద్రబాబు కోర్టులో పిటిషన్ వేస్తారని అనుమానంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి

'బండి సంజయ్... మీ తెలంగాణలో చూసుకో, ఇక్కడ అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.