ETV Bharat / city

తిరుమల కనుమ దారిలో ప్రమాదం.. నలుగురు భక్తులకు గాయాలు

author img

By

Published : Jan 2, 2021, 9:45 PM IST

తిరుమల మెుదటి కనుమ దారిలో 35వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. భక్తులు శ్రీవారి దర్శనం ముగించుకుని వస్తుండగా ఘటన జరిగింది.

tirumala ghat road accident
తిరుమల కనుమ దారిలో ప్రమాదం

తిరుమల మొదటి కనుమ దారిలో రెండు కార్లు ఢీ కొన్నాయి. శ్రీవారి దర్శనానంతరం తిరుగు పయనమైన యాత్రికుల కారు 35వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొంది. వెనుక వస్తున్న మరో కారు ప్రమాదానికి గురైన కారును ఢీకొనడంతో.. హైదరాబాద్​కు చెందిన నలుగురు భక్తులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో మొదటి కనుమ దారిలో కొంత సమయం ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

తిరుమల మొదటి కనుమ దారిలో రెండు కార్లు ఢీ కొన్నాయి. శ్రీవారి దర్శనానంతరం తిరుగు పయనమైన యాత్రికుల కారు 35వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొంది. వెనుక వస్తున్న మరో కారు ప్రమాదానికి గురైన కారును ఢీకొనడంతో.. హైదరాబాద్​కు చెందిన నలుగురు భక్తులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో మొదటి కనుమ దారిలో కొంత సమయం ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి: కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.