ETV Bharat / city

ప్రత్యర్థికి ఓటేశారనే కక్షతో కొన్ని కుటుంబాల వెలి...కలెక్టర్ పర్యటనతో ఘటన వెలుగులోకి!

author img

By

Published : Mar 4, 2021, 5:53 AM IST

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడమే పాపమైంది. నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడమే నేరమైంది. గ్రామం నుంచి వెలి వేసి పగ తీర్చుకున్నారు. దాడి చేసి అవమానించారు. ఎస్సై నుంచి కలెక్టర్‌ వరకూ కాళ్లపై పడినా న్యాయం జరగలేదు. గ్రామంలోని పెద్దవాళ్ల ప్రతీకారం, అధికారుల అలసత్వం మధ్య చాలా కుటుంబాలు నలిగిపోతున్నాయి.

Some families were expelled in kajuluru
ప్రత్యర్థికి ఓటేశారనే కక్షతో కొన్ని కుటుంబాల వెలి

తమ ప్రత్యర్థికి ఓటేశారనే కక్షతో పలు కుటుంబాలను వెలి వేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం జగన్నాథగిరి గుత్తులవారి పేటలో వివాదాస్పదంగా మారింది. ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో అరుణ అనే అభ్యర్థి సర్పంచ్‌గా నెగ్గారు. తాము సూచించిన పద్మకుమారి అనే అభ్యర్థికి ఓటు వేయలేదని చాలా కుటుంబాలను గ్రామపెద్దలు నిందించారు. అంతటితో ఆగకుండా తమపై దాడి చేసి గ్రామం నుంచి వెలి వేస్తున్నట్టు ప్రకటించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో మళ్లీ కలుపుకోవాలంటే భారీగా సొమ్ము చెల్లించాలని హుకుం జారీ చేశారని చెబుతున్నారు.

ఈ పరిస్థితి నుంచి కాపాడాలంటూ గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే తమపైనే కేసు నమోదు చేస్తామని బెదిరించారని బాధితులు వాపోయారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కాజులూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా బాధితులంతా ప్లకార్డులు చేతబట్టి ఎదుటే నిలుచున్నా ఆయన కనీసం ఏం జరిగిందని అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యర్థుల బెదిరింపులతో ప్రస్తుతం భయంతో కాలం వెళ్లదీస్తున్నామని.... ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

తమ ప్రత్యర్థికి ఓటేశారనే కక్షతో పలు కుటుంబాలను వెలి వేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం జగన్నాథగిరి గుత్తులవారి పేటలో వివాదాస్పదంగా మారింది. ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో అరుణ అనే అభ్యర్థి సర్పంచ్‌గా నెగ్గారు. తాము సూచించిన పద్మకుమారి అనే అభ్యర్థికి ఓటు వేయలేదని చాలా కుటుంబాలను గ్రామపెద్దలు నిందించారు. అంతటితో ఆగకుండా తమపై దాడి చేసి గ్రామం నుంచి వెలి వేస్తున్నట్టు ప్రకటించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో మళ్లీ కలుపుకోవాలంటే భారీగా సొమ్ము చెల్లించాలని హుకుం జారీ చేశారని చెబుతున్నారు.

ఈ పరిస్థితి నుంచి కాపాడాలంటూ గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే తమపైనే కేసు నమోదు చేస్తామని బెదిరించారని బాధితులు వాపోయారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కాజులూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా బాధితులంతా ప్లకార్డులు చేతబట్టి ఎదుటే నిలుచున్నా ఆయన కనీసం ఏం జరిగిందని అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యర్థుల బెదిరింపులతో ప్రస్తుతం భయంతో కాలం వెళ్లదీస్తున్నామని.... ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చదవండి;

జగన్​కు తన పాలనపై నమ్మకం లేదు: కన్నా లక్ష్మీనారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.