ETV Bharat / city

తెలంగాణ: నల్గొండ జిల్లాలో అటవీ అధికారులు బంధించిన చిరుత మృతి - leopard died in nalgonda dist

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో అటవీ అధికారులు బంధించిన చిరుత మృతి చెందింది. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు నెహ్రు జంతుప్రదర్శన శాల క్యూరేటర్​ తెలిపారు. మృతిచెందిన చిరుతకు పశువైద్యుల బృందం శవపరీక్ష చేసింది.

leopard died in nalgonda dist marriguda
leopard died in nalgonda dist marriguda
author img

By

Published : May 28, 2020, 8:10 PM IST

ఈరోజు ఉదయం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజుపేట తండా గ్రామ శివారులో కృష్ణ నాయక్​కు చెందిన పొలంలో చిరుత కనిపించింది. పంటకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన ముళ్లకంచెలో చిరుత ఇరుక్కుంది. చిరుతను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు శ్రమించారు. ముళ్లకంచె నుంచి తప్పించేందుకు గంటల తరబడి యత్నించారు. ఎట్టకేలకు చిరుతను సురక్షితంగా బోనులో బంధించారు. ఈ క్రమంలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలైన విషయం తెలిసిందే.

ఈరోజు ఉదయం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజుపేట తండా గ్రామ శివారులో కృష్ణ నాయక్​కు చెందిన పొలంలో చిరుత కనిపించింది. పంటకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన ముళ్లకంచెలో చిరుత ఇరుక్కుంది. చిరుతను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు శ్రమించారు. ముళ్లకంచె నుంచి తప్పించేందుకు గంటల తరబడి యత్నించారు. ఎట్టకేలకు చిరుతను సురక్షితంగా బోనులో బంధించారు. ఈ క్రమంలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలైన విషయం తెలిసిందే.


ఇవీ చూడండి: తెలంగాణ : ముళ్లకంచెలో చిరుత... ఎట్టకేలకు చిక్కిందిలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.