ETV Bharat / city

కోతులతో తస్మాత్ జాగ్రత్త.. లేకపోతే జరిమానా తప్పదు! - fine for monkey Detention in hyderabad news

కోతి పిల్లను గోలుసుతో కట్టేసి భిక్షాటన చేసినందుకు రూ.10వేల జరిమానా కట్టాల్సి వచ్చిన ఘటన హైదరాబాద్​ ఉప్పల్​లో చోటుచేసుకుంది.

fine for monkey Detention in hyderabad
author img

By

Published : Nov 1, 2019, 7:00 AM IST

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, పొన్నాలకు చెందిన కోట పోచయ్య, పోచమ్మ దంపతులు కుమారుడితో కలిసి మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. నగరంలో గాడిద పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు మంగళవారం కోతి పిల్లను గొలుసుతో కట్టి ఆడిస్తూ భిక్షాటన చేశాడు. గమనించిన కంపాశనేట్‌ సొసైటీ ఫర్‌ అనిమల్స్‌ ఫౌండర్‌, ఛైర్‌పర్సన్‌ నాగారం ప్రవళిక... ఆ బాలుడిని, కోతిపిల్లను తీసుకొని ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు బాలుడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి వారందరికీ కౌన్సెలింగ్‌ ఇప్పించారు. కోతిపిల్లతోపాటు బాలుడు, అతడి తల్లిదండ్రులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. విచారణ జరిపిన అధికారులు బాలుడి కుటుంబానికి రూ.10వేల జరిమానా విధించారు. కోతిపిల్లను చెంగిచర్ల అటవీ ప్రాంతంలో వదిలేశారు.

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, పొన్నాలకు చెందిన కోట పోచయ్య, పోచమ్మ దంపతులు కుమారుడితో కలిసి మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. నగరంలో గాడిద పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు మంగళవారం కోతి పిల్లను గొలుసుతో కట్టి ఆడిస్తూ భిక్షాటన చేశాడు. గమనించిన కంపాశనేట్‌ సొసైటీ ఫర్‌ అనిమల్స్‌ ఫౌండర్‌, ఛైర్‌పర్సన్‌ నాగారం ప్రవళిక... ఆ బాలుడిని, కోతిపిల్లను తీసుకొని ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు బాలుడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి వారందరికీ కౌన్సెలింగ్‌ ఇప్పించారు. కోతిపిల్లతోపాటు బాలుడు, అతడి తల్లిదండ్రులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. విచారణ జరిపిన అధికారులు బాలుడి కుటుంబానికి రూ.10వేల జరిమానా విధించారు. కోతిపిల్లను చెంగిచర్ల అటవీ ప్రాంతంలో వదిలేశారు.

File : TG_Hyd_71_31_Assembly_Secretary_Dry_3053262 From : Raghu Vardhan ( ) శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు పదవీకాలాన్ని పొడిగించారు. ప్రస్తుతం కార్యదర్శిగా కొనసాగుతోన్న ఆయన పదవీకాలం ఇవాళ్టితో పూర్తైంది. తెలంగాణ శాసనసభ తొలి కార్యదర్శి రాజాసదారాం పదవీవిరమణ అనంతరం నరసింహాచార్యులు బాధ్యతలు చేపట్టారు. నేటితో ఆయన పదవీకాలం పూర్తైంది. దీంతో ఆయన పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నరసింహాచార్యాలు శాసనసభ కార్యదర్శిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.