ETV Bharat / city

కర్నూలు ఎమ్మెల్యే నగర పాదయాత్ర

author img

By

Published : Nov 6, 2020, 5:59 PM IST

జగన్ పాదయాత్రకు.. నేటితో మూడేళ్లు కావొస్తోంది. నగరంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సైతం అదే బాటలో మందుకు సాగారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

kurnool mla padayatra
పాదయాత్రలో కర్నూలు ఎమ్మెల్యే

ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు.. పది రోజుల పాటు నగరంలో పాదయాత్ర చేస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హమీల్లో దాదాపు 90 శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందన్నారు.

ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేసి నేటికి ముడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజు వైఎస్సార్ కూడలిలోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి యాత్ర ప్రారంభించారు.

ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు.. పది రోజుల పాటు నగరంలో పాదయాత్ర చేస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హమీల్లో దాదాపు 90 శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందన్నారు.

ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేసి నేటికి ముడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజు వైఎస్సార్ కూడలిలోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి యాత్ర ప్రారంభించారు.

ఇదీ చదవండి:

ఇద్దరు యువతుల ప్రేమాయణం... ఇంటి నుంచి అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.