ETV Bharat / city

ఆ రైతులకే సున్నావడ్డీ.. వీరికి ఎలా ఇస్తాం? - మంత్రి కన్నబాబు

పంట పండించే అసలైన రైతులను గుర్తించడానికే ఈ-క్రాప్‌ విధానం తెచ్చామన్నారు మంత్రి కన్నబాబు. పంటలు పండించే రైతులకే సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని స్పష్టం చేశారు. కాకినాడలో మాట్లాడిన ఆయన.. రైతుల ముసుగులో రుణాలు పొందినవారిని కట్టడిచేస్తే.. కొందరు విమర్శించడం సరికాదన్నారు.

author img

By

Published : Nov 10, 2021, 6:50 AM IST

minister kannababu
minister kannababu

‘ఎక్కడో అమెరికాలోనో, హైదరాబాద్‌లోనో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ తక్కువ వడ్డీకి వస్తుందని పంటరుణాలు తీసుకుంటున్నారు. రైతులు కానివారంతా భూములు ఉన్నాయనో, రైతులుగానో చూపించుకుని సర్కారు సాయం పొందుతున్నారు. అలా కాకుండా.. నిజమైన రైతులకే ఫలితం అందాలని ఉద్దేశంతో మేం సంస్కరణలు తెచ్చాం’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.

పంట పండించే అసలైన రైతులను గుర్తించడానికే ఈ-క్రాప్‌ విధానం తెచ్చామని, ఏ భూముల్లో.. ఏ పంట.. ఏ రైతు ఎంత వేశారో తెలియాలంటే ఈ-క్రాప్‌లో నమోదు చేయాల్సిందేనని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇంత మంచి విధానంలో తప్పులుంటే సూచించాలే తప్ప విమర్శించడం సరికాదన్నారు.

సకాలంలో రైతులు తిరిగి చెల్లిస్తే రూ.లక్ష లోపు తీసుకున్న రుణాలకు సున్నావడ్డీ కింద రాయితీ ఇవ్వాలన్నది పథకం ఉద్దేశమని తెలిపారు. ఉచిత బీమా, పెట్టుబడి, సున్నావడ్డీ, మార్కెటింగ్‌ సౌకర్యం అన్నదాతలకు అందాలనే ఉద్దేశంతోనే ఈ-క్రాప్‌ను రైతులు వేసిన పంటలకు అనుసంధానం చేశామన్నారు. ఈ సంస్కరణల వల్లే సున్నావడ్డీ పంట రుణాల మొత్తం తగ్గిందని మంత్రి వివరించారు. రైతుల ముసుగులో రుణాలు పొందినవారిని కట్టడిచేస్తే విమర్శించడం సరికాదన్నారు.

ఇదీ మంత్రి చెప్పిన లెక్క..
* 2019 సీజన్‌ ప్రారంభంలో 14.26లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.289.68 కోట్లు
* 2020 ఖరీఫ్‌ సీజన్‌లో పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన వారు 6.67 లక్షల మంది. వారికి రూ.112.71 కోట్ల లబ్ధి
* 2021 ఏప్రిల్‌ 20న 5.56 లక్షల మందికి రూ.92.38 కోట్ల చెల్లింపు
* పంట నమోదు చూసినప్పుడు 3.51 లక్షల మంది ఈ-క్రాప్‌తో సరిపోలలేదు. పంటలు పండించని వారిని తగ్గించాక 6.67 లక్షల మందిగా లెక్క తేలింది.
* 2014- నుంచి 2018 వరకు తెదేపా వడ్డీ రాయితీ కింద రైతులకు రూ.1,180 కోట్లు బకాయి పడితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి 38.42 లక్షల మంది రైతులకు చంద్రబాబు బాకీ పెట్టిన రూ. 688.28 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేశారు.

ఇదీ చదవండి:

CM'S MEETING: సమస్యల పరిష్కారానికి సీఎస్​లతో సంయుక్త కమిటీ

‘ఎక్కడో అమెరికాలోనో, హైదరాబాద్‌లోనో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ తక్కువ వడ్డీకి వస్తుందని పంటరుణాలు తీసుకుంటున్నారు. రైతులు కానివారంతా భూములు ఉన్నాయనో, రైతులుగానో చూపించుకుని సర్కారు సాయం పొందుతున్నారు. అలా కాకుండా.. నిజమైన రైతులకే ఫలితం అందాలని ఉద్దేశంతో మేం సంస్కరణలు తెచ్చాం’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.

పంట పండించే అసలైన రైతులను గుర్తించడానికే ఈ-క్రాప్‌ విధానం తెచ్చామని, ఏ భూముల్లో.. ఏ పంట.. ఏ రైతు ఎంత వేశారో తెలియాలంటే ఈ-క్రాప్‌లో నమోదు చేయాల్సిందేనని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇంత మంచి విధానంలో తప్పులుంటే సూచించాలే తప్ప విమర్శించడం సరికాదన్నారు.

సకాలంలో రైతులు తిరిగి చెల్లిస్తే రూ.లక్ష లోపు తీసుకున్న రుణాలకు సున్నావడ్డీ కింద రాయితీ ఇవ్వాలన్నది పథకం ఉద్దేశమని తెలిపారు. ఉచిత బీమా, పెట్టుబడి, సున్నావడ్డీ, మార్కెటింగ్‌ సౌకర్యం అన్నదాతలకు అందాలనే ఉద్దేశంతోనే ఈ-క్రాప్‌ను రైతులు వేసిన పంటలకు అనుసంధానం చేశామన్నారు. ఈ సంస్కరణల వల్లే సున్నావడ్డీ పంట రుణాల మొత్తం తగ్గిందని మంత్రి వివరించారు. రైతుల ముసుగులో రుణాలు పొందినవారిని కట్టడిచేస్తే విమర్శించడం సరికాదన్నారు.

ఇదీ మంత్రి చెప్పిన లెక్క..
* 2019 సీజన్‌ ప్రారంభంలో 14.26లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.289.68 కోట్లు
* 2020 ఖరీఫ్‌ సీజన్‌లో పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన వారు 6.67 లక్షల మంది. వారికి రూ.112.71 కోట్ల లబ్ధి
* 2021 ఏప్రిల్‌ 20న 5.56 లక్షల మందికి రూ.92.38 కోట్ల చెల్లింపు
* పంట నమోదు చూసినప్పుడు 3.51 లక్షల మంది ఈ-క్రాప్‌తో సరిపోలలేదు. పంటలు పండించని వారిని తగ్గించాక 6.67 లక్షల మందిగా లెక్క తేలింది.
* 2014- నుంచి 2018 వరకు తెదేపా వడ్డీ రాయితీ కింద రైతులకు రూ.1,180 కోట్లు బకాయి పడితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి 38.42 లక్షల మంది రైతులకు చంద్రబాబు బాకీ పెట్టిన రూ. 688.28 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేశారు.

ఇదీ చదవండి:

CM'S MEETING: సమస్యల పరిష్కారానికి సీఎస్​లతో సంయుక్త కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.