House Tax: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ ఇంటికి.. లక్షా 5 వేల రూపాయల ఇంటి పన్ను విధించింది నగరపాలక సంస్థ! పర్లోవపేటలో 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటికి.. గతం నుంచి ఇంటి పన్ను బకాయి ఉంది. దీంతో.. లక్షా 5 వేల రూపాయల ఇంటి పన్ను చెల్లించాలంటూ.. తాజాగా అధికారులు నోటీసు ఇవ్వడంతో ఇంటి యజమాని దిప్పాడ వెంకన్న కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. చేపల వేట సాగించి జీవనం సాగించే తాము.. అంత డబ్బులు ఎలా చెల్లించాలని వాపోతున్నారు. ఇప్పటికే నీటి సరఫరా నిలిపివేశారని కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంటికి అంత పన్ను వేయడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీకి అప్పు చేసి రూ.5 వేలు చెల్లించినా నీటి సరఫరా పునరుద్ధరించటంలేదని వాపోయారు.
ఇదీ చదవండి: Bus accident: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా.. ఎనిమిది మంది మృతి