ETV Bharat / city

'మద్యం మాఫియాపై సీబీఐ విచారణ జరిపించాలి'

author img

By

Published : Aug 29, 2020, 4:32 PM IST

రాష్ట్రంలో మద్యం మాఫియాపై సీబీఐ విచారణ జరిపించాలని తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

tdp leader govardhan reddy
tdp leader govardhan reddy

జగన్మోహన్ రెడ్డి సర్కారులో మద్యం మాఫియా విచ్చలవిడిగా పెరుగుతోందని తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. మద్యం మాఫియాపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

శనివారం కడప ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడిన గోవర్థన్... వైకాపా సర్కార్​పై విమర్శలు కురిపించారు. కనీవినీ ఎరుగని బ్రాండ్లు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కొంతమంది వైకాపా నాయకులు మద్యం తయారీ కర్మాగారాలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని గోవర్థన్ ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి సర్కారులో మద్యం మాఫియా విచ్చలవిడిగా పెరుగుతోందని తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. మద్యం మాఫియాపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

శనివారం కడప ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడిన గోవర్థన్... వైకాపా సర్కార్​పై విమర్శలు కురిపించారు. కనీవినీ ఎరుగని బ్రాండ్లు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కొంతమంది వైకాపా నాయకులు మద్యం తయారీ కర్మాగారాలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని గోవర్థన్ ఆరోపించారు.

ఇదీ చదవండి

విశాఖలో దారుణం... ఎస్సీ యువకుడికి శిరోముండనం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.