దిల్లీలో గత నెల 25న అదృశ్యమైన ఇద్దరు తెలుగు వైద్యుల ఆచూకీ దొరికింది. వైద్యులు దిలీప్సత్య, హిమబిందు సిక్కింలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హిమబిందు భర్త శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దిల్లీ పోలీసులు... వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇద్దరి సామాజిక మాధ్యమాల ఖాతాలపై నిఘా ఉంచారు. దిలీప్సత్య తన సోషల్ మీడియా ఖాతాను ఉపయోగించడం వల్ల సాంకేతిక నిఘా ద్వారా వారి జాడను తెలుసుకున్నారు. వీరిద్దరూ సిక్కిం ఎందుకు వెళ్లారు... వీరి అదృశ్యం వెనుక కారణాలపై ఇద్దరినీ దిల్లీ తీసుకొచ్చి విచారిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన హిమబిందు, అనంతపురం జిల్లాకు చెందిన దిలీప్సత్య అదృశ్యమైనట్లు... డిసెంబరు 25న దిల్లీలోని హాజ్ ఖాస్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. హిమబిందు భర్త శ్రీధర్, దిలీప్ భార్య... సహా కుటుంబ సభ్యులకు వీరి ఆచూకీపై సమాచారాన్ని పోలీసులు అందించారు.
ఇవీ చదవండి:
ఒక్క పెయిడ్ ఆర్టిస్టు ఉన్నట్టు నిరూపించినా.. ఉద్యమం ఆపేస్తాం