ETV Bharat / city

'వైద్య సిబ్బంది లక్ష్యాలను పూర్తి చేయాలి'

కడప నియోజకవర్గంలో కరోనా నిర్ధరణ పరీక్షల విషయంలో వైద్య సిబ్బంది తమకిచ్చిన లక్ష్యాలను చేరుకోవాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆదేశించారు. కరోనా కట్టడికి ప్రజలు సైతం సహకారం అందించాలని కోరారు.

author img

By

Published : Sep 28, 2020, 11:22 PM IST

deputy cm amjad basha
deputy cm amjad basha

కడప నియోజకవర్గంలో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్నందున వైద్యులు, ఏఎన్​ఎంలు, ఆశా వర్కర్లు కరోనా పరీక్షలకు సంబంధించిన టార్గెట్​లను పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆదేశించారు. సోమవారం కడప నగర పాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ పృథ్వీతేజ్ ఆధ్వర్యంలో కొవిడ్- 19పై నియోజకవర్గ టాస్క్​ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా హాజరై ప్రసంగించారు.

నియోజకవర్గంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంచవచ్చని వెల్లడించారు. హోటళ్లు రాత్రి 9 వరకు పార్సిళ్ల ద్వారా విక్రయాలు నిర్వహించుకోవచ్చన్నారు. కరోనా కట్టడి విషయంలో అధికారులకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కడప నియోజకవర్గంలో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్నందున వైద్యులు, ఏఎన్​ఎంలు, ఆశా వర్కర్లు కరోనా పరీక్షలకు సంబంధించిన టార్గెట్​లను పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆదేశించారు. సోమవారం కడప నగర పాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ పృథ్వీతేజ్ ఆధ్వర్యంలో కొవిడ్- 19పై నియోజకవర్గ టాస్క్​ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా హాజరై ప్రసంగించారు.

నియోజకవర్గంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉంచవచ్చని వెల్లడించారు. హోటళ్లు రాత్రి 9 వరకు పార్సిళ్ల ద్వారా విక్రయాలు నిర్వహించుకోవచ్చన్నారు. కరోనా కట్టడి విషయంలో అధికారులకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.