ETV Bharat / city

మొబైల్​ సూపర్​ మార్కెట్​ ప్రారంభించిన హోం మంత్రి

author img

By

Published : Apr 17, 2020, 1:32 PM IST

కరోనా నియంత్రణకు ప్రజలందరూ కనీస జాగ్రత్తలు పాటించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని రెడ్​జోన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు మొబైల్ సూపర్​ మార్కెట్​ను ఆమె ప్రారంభించారు.

home minister sucharitha
home minister sucharitha

లాక్​డౌన్ సమయంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని రెడ్​జోన్లలో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు మొబైల్ సూపర్ మార్కెట్​ను ఆమె ప్రారంభించారు. అమరావతి సూపర్ మార్కెట్స్ ఆధ్వర్యంలో కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారికి వీటి ద్వారా కిరాణా సరకులు విక్రయించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు సమకూర్చింది. రెడ్​జోన్లలో ప్రజలు బయటకు వచ్చే వీలు లేనందున ఈ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అలాగే భౌతిక దూరం పాటించాలని సూచించారు. నగరంలోని అన్ని రెడ్​జోన్లలో ఈ మొబైల్ మార్కెట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్ సమయంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని రెడ్​జోన్లలో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు మొబైల్ సూపర్ మార్కెట్​ను ఆమె ప్రారంభించారు. అమరావతి సూపర్ మార్కెట్స్ ఆధ్వర్యంలో కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారికి వీటి ద్వారా కిరాణా సరకులు విక్రయించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు సమకూర్చింది. రెడ్​జోన్లలో ప్రజలు బయటకు వచ్చే వీలు లేనందున ఈ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అలాగే భౌతిక దూరం పాటించాలని సూచించారు. నగరంలోని అన్ని రెడ్​జోన్లలో ఈ మొబైల్ మార్కెట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో 572కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.