ETV Bharat / city

'శిక్షణ తీసుకుంటేనే వ్యాపారానికి లైసెన్స్'

author img

By

Published : Dec 5, 2020, 4:36 PM IST

ఆహార పదార్థాల కల్తీ నియంత్రణపై గుంటూరులో వ్యాపారులకు ఆహార భద్రత అధికారులు శిక్షణ నిర్వహించారు. శిక్షణలో ఉత్తీర్ణులైన వ్యాపారులకి ధ్రువపత్రాలు ఇస్తామని.. భవిష్యత్తులో ఈ పత్రం లేకుంటే వ్యాపారానికి లైసెన్స్ ఇవ్వబోమని అధికారులు తేల్చి చెప్పారు.

Guntur
Guntur

ఆహార పదార్థాల కల్తీ నియంత్రణపై వ్యాపారులకు ఆహార భద్రత అధికారులు శిక్షణ నిర్వహించారు. గుంటూరులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శనివారం నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమానికి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్‌ మొహిద్దీన్ హాజరయ్యారు.

జిల్లాలో వ్యాపారులందరికీ ఆహార కల్తీ నియంత్రణపై శిక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. శిక్షణలో ఉత్తీర్ణులైన వ్యాపారులకి ధ్రువపత్రాలు ఇస్తామని.. భవిష్యత్తులో ఈ పత్రం లేకుంటే వ్యాపారానికి లైసెన్స్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హోల్ సేల్ నుంచి రిటైల్ వ్యాపారులందరికి దశల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ చెప్పారు.

ఆహార పదార్థాల కల్తీ నియంత్రణపై వ్యాపారులకు ఆహార భద్రత అధికారులు శిక్షణ నిర్వహించారు. గుంటూరులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శనివారం నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమానికి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్‌ మొహిద్దీన్ హాజరయ్యారు.

జిల్లాలో వ్యాపారులందరికీ ఆహార కల్తీ నియంత్రణపై శిక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. శిక్షణలో ఉత్తీర్ణులైన వ్యాపారులకి ధ్రువపత్రాలు ఇస్తామని.. భవిష్యత్తులో ఈ పత్రం లేకుంటే వ్యాపారానికి లైసెన్స్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హోల్ సేల్ నుంచి రిటైల్ వ్యాపారులందరికి దశల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ చెప్పారు.

ఇదీ చదవండి

పరీక్షలు వాయిదా వేయండి.. సీఎంకు గ్రూప్-1 అభ్యర్థుల వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.