ETV Bharat / city

కరోనా బయోవ్యర్థాల సేకరణలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం

author img

By

Published : Apr 30, 2021, 7:10 PM IST

కొవిడ్ కట్టడి ఎంత ముఖ్యమో.. ఆసుపత్రుల్లోని బయో వ్యర్థాలతో ఇతర వ్యాధులు రాకుండా చూసుకోవడమూ అంతే ముఖ్యం. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. ప్రభుత్వాసుపత్రుల్లో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్రమాణాలకు తగ్గట్టుగానే ఉన్నా.. ప్రైవేట్ వైద్యశాలల్లో ఆ ఊసే లేదు.

ggh
ggh
కొవిడ్ వ్యర్థాల నిర్వహణలో జీజీహెచ్ భేష్

కొవిడ్‌ స్వైరవిహారంతో ఆసుపత్రుల్లో పడకలే దొరకనంతగా రోగులు చేరుతున్నారు. రోజూ వచ్చే వందల కిలోల వ్యర్థాల నిర్వహణను గుంటూరు ప్రభుత్వాసుపత్రి.. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తోంది. వ్యర్థాల రకం బట్టి వేర్వేరు రంగుల కవర్లలో వాటిని సేకరిస్తున్నారు. జీజీహెచ్​ నుంచి జనవరిలో 5 వేల 178, ఫిబ్రవరిలో 5 వేల 20, మార్చిలో 5 వేల 992 కిలోల చొప్పున బయో మెడికల్ వ్యర్థాలు బయటకు రాగా.. ఏప్రిల్‌లోనూ 5వేల కిలోలు దాటింది. సాధారణంగా రోజుకు 130కిలోల దాకా వ్యర్థాల సేకరణ జరగ్గా.. కొవిడ్ సమయంలో ఇది 180 కిలోలకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. వ్యర్థాల సేకరణ, నిల్వ, తరలింపులో పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు.

కరోనా ప్రభావం మొదలైన దగ్గర్నుంచి పీపీఈ కిట్లు, గ్లోవ్స్‌, మాస్కుల వినియోగం అధికమవటంతో.. వ్యర్థాల పరిమాణమూ పెరిగింది. గుంటూరు జిల్లాలో కొవిడ్ చికిత్సకు 70 ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతి పొందగా.. ఇందులో కొన్ని బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణను గాలికొదిలేస్తున్నాయి. అలాంటి ఆసుపత్రులపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్ కేర్​ సెంటర్​ని పరిశీలించిన కలెక్టర్

కొవిడ్ వ్యర్థాల నిర్వహణలో జీజీహెచ్ భేష్

కొవిడ్‌ స్వైరవిహారంతో ఆసుపత్రుల్లో పడకలే దొరకనంతగా రోగులు చేరుతున్నారు. రోజూ వచ్చే వందల కిలోల వ్యర్థాల నిర్వహణను గుంటూరు ప్రభుత్వాసుపత్రి.. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తోంది. వ్యర్థాల రకం బట్టి వేర్వేరు రంగుల కవర్లలో వాటిని సేకరిస్తున్నారు. జీజీహెచ్​ నుంచి జనవరిలో 5 వేల 178, ఫిబ్రవరిలో 5 వేల 20, మార్చిలో 5 వేల 992 కిలోల చొప్పున బయో మెడికల్ వ్యర్థాలు బయటకు రాగా.. ఏప్రిల్‌లోనూ 5వేల కిలోలు దాటింది. సాధారణంగా రోజుకు 130కిలోల దాకా వ్యర్థాల సేకరణ జరగ్గా.. కొవిడ్ సమయంలో ఇది 180 కిలోలకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. వ్యర్థాల సేకరణ, నిల్వ, తరలింపులో పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు.

కరోనా ప్రభావం మొదలైన దగ్గర్నుంచి పీపీఈ కిట్లు, గ్లోవ్స్‌, మాస్కుల వినియోగం అధికమవటంతో.. వ్యర్థాల పరిమాణమూ పెరిగింది. గుంటూరు జిల్లాలో కొవిడ్ చికిత్సకు 70 ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతి పొందగా.. ఇందులో కొన్ని బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణను గాలికొదిలేస్తున్నాయి. అలాంటి ఆసుపత్రులపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్ కేర్​ సెంటర్​ని పరిశీలించిన కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.