ETV Bharat / city

'చింతమనేనిపై పోలీసులే బలవంతంగా కేసు పెట్టించారు'

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కల్పితమేనని ఫిర్యాదుదారులు స్పష్టం చేశారు. తమను బెదిరించి పోలీసులే బలవంతంగా కేసు పెట్టించారని వెల్లడించారు.

author img

By

Published : Sep 7, 2019, 4:55 PM IST

Updated : Sep 7, 2019, 5:38 PM IST

ఫిర్యాదుదారులు


పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కల్పితమని ఫిర్యాదుదారులు ఆరోపించారు. తమను చింతమనేని ప్రభాకర్​ దూషించినట్లు పోలీసులే కథ అల్లారని బిళ్లా రామకృష్ణ, తోట సందీప్​ వెల్లడించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్రా కార్యాలయాని వచ్చిన ఫిర్యాదుదారులు... పలు విషయాలు వెల్లడించారు. పోలీసులే తమతో బలవంతంగా కేసు పెట్టించారని స్పష్టం చేశారు.

చింతమనేనిపై మేం కేసుపెట్టలేదు!

'చింతమనేని మాపై కేసు పెట్టారంటే స్టేషన్​కు వెళ్లాం. అసలు ఆ రోజు ఆయన సంఘటనా స్థలానికే రాలేదు. పోలీసులే మాతో బలవంతంగా కేసు పెట్టించారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అంతా కల్పితమే.'
-- చింతమనేనిపై కేసు పెట్టిన వ్యక్తులు.

ఇవీ చదవండి...'చింతమనేని వీడియో ఎడిట్‌, చేసి వైరల్‌ చేశారు'


పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కల్పితమని ఫిర్యాదుదారులు ఆరోపించారు. తమను చింతమనేని ప్రభాకర్​ దూషించినట్లు పోలీసులే కథ అల్లారని బిళ్లా రామకృష్ణ, తోట సందీప్​ వెల్లడించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్రా కార్యాలయాని వచ్చిన ఫిర్యాదుదారులు... పలు విషయాలు వెల్లడించారు. పోలీసులే తమతో బలవంతంగా కేసు పెట్టించారని స్పష్టం చేశారు.

చింతమనేనిపై మేం కేసుపెట్టలేదు!

'చింతమనేని మాపై కేసు పెట్టారంటే స్టేషన్​కు వెళ్లాం. అసలు ఆ రోజు ఆయన సంఘటనా స్థలానికే రాలేదు. పోలీసులే మాతో బలవంతంగా కేసు పెట్టించారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అంతా కల్పితమే.'
-- చింతమనేనిపై కేసు పెట్టిన వ్యక్తులు.

ఇవీ చదవండి...'చింతమనేని వీడియో ఎడిట్‌, చేసి వైరల్‌ చేశారు'

Intro:ap_tpt_51_07_fevers_at_palamaner_pkg_ap10105

తగ్గని జ్వరాలు ఆగని మరణాలు
* పలమనేరు లో విజృంభిస్తున్న విషజ్వరాలు
* కారణం తెలియక తల పట్టుకుంటున్న వైద్య సిబ్బందిBody:చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే గతబినెలలో నియోజకవర్గ పరిధిలోని గంగవరం మండలం చిన్నూరు గ్రామంలో తొమ్మిదేళ్ల బాలుడు జ్వరం కారణంగా మృతి చెందగా... తాజాగా బైరెడ్డిపల్లె మండలం, గంగవరం మండల పరిధిలోని గ్రామంలలో రెండు రోజుల్లో ఇద్దరు జ్వరంతో మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 5వతేది బైరెడ్డిపల్లె మండలం మురారిపల్లె గ్రామంలో అమరనాథ్ అనే 23 ఏళ్ల యువకుడు మృతి చెందగా... 6వతేది శుక్రవారం గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో దనేంద్ర (18) అనే యువకుడు జ్వరంతో మృతి చెందాడు. ఈ సంఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుండగా... వైద్యులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ గ్రామాలలో తరచు వైద్యశిబిరాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా జ్వరాలు అదుపు కావడం లేదు. పంచాయతీ సిబ్బంది కూడా అన్ని గ్రామాలలో యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నట్లు చెప్తుండడంతో జ్వరాలు అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగించే విషయం. కాగా ఈ అంశంపై గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మురళి కృష్ణ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా ఆర్.ఎం.పి లను ఆశ్రయిస్తుండడంతో వారు డెంగీ జ్వరం అని భయపెట్టేస్తున్నారని, అయితే గంగవరం ప్రాంతంలో ఎక్కడా డెంగీ జ్వరం లేదని.. ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు పాటించి ఆరోగ్య పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటే చాలన్నారు. ఒకరోజు కంటే ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించుకోవలని కోరారు. అలాగే తాము కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తగిన సలహాలు, సూచనలు చేస్తున్నామని, వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నామని పేర్కొన్నారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
Last Updated : Sep 7, 2019, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.