ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగులపేరుతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్​ అరెస్టు

author img

By

Published : Jul 19, 2021, 10:08 PM IST

నకిలీ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గుర్ని గుంటూరులో పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులమంటూ మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.

ake-government-employees
గ్యాంగ్​ అరెస్టు

నకిలీ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను గుంటూరులో నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు మేకల సాయికుమార్ అనే వ్యక్తితో పాటు అతనికి సహకరిస్తున్న అయ్యప్ప, రాజమండ్రికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

కానిస్టేబుల్ పేరు చెప్పి తన సెల్ ఫోన్ లాక్కోవడమే కాకుండా తాను ప్రమాదానికి గురైనట్లు బంధువుల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ సాయికుమార్ పై ఆటోడ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఇద్దరు దొంగలు అరెస్టు...6 బైక్​లు స్వాధీనం

నకిలీ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను గుంటూరులో నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు మేకల సాయికుమార్ అనే వ్యక్తితో పాటు అతనికి సహకరిస్తున్న అయ్యప్ప, రాజమండ్రికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

కానిస్టేబుల్ పేరు చెప్పి తన సెల్ ఫోన్ లాక్కోవడమే కాకుండా తాను ప్రమాదానికి గురైనట్లు బంధువుల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ సాయికుమార్ పై ఆటోడ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఇద్దరు దొంగలు అరెస్టు...6 బైక్​లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.