అనిశాకు దొరికిన అవినీతి అధికారి పది వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు గుంటూరు విద్యుత్ శాఖ ఏఈ. గుంటూరులోని నెహ్రూ నగర్కు చెందిన శ్రీనివాసరావు... తాను నూతనంగా నిర్మించిన షాపుల్లో మీటర్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ ఇంజినీర్ వెంకటేశ్వర్లును అనుమతికోరారు. అందుకు 10 వేల రూపాయలు లంచాన్ని డిమాండ్ చేశారు. విషయాన్ని బాధితుడు అనిశా అధికారులకు చేరవేశాడు. పక్కా ప్రణాళిక ప్రకారం వల విసిరన అధికారులు.. వెంకటేశ్వర్లును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. తగిన చర్యలు తీసుకుంటామని అనిశా అదనపు ఎస్పీ సురేష్ బాబు చెప్పారు.