ETV Bharat / city

'ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే పరిశోధన సంస్థల లక్ష్యం' - Pediatric Rare Genetic Disorders Laboratory

ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేదా పరిశోధన అయినా అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు సౌకర్యవంతంగా మార్చటమే లక్ష్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్​ ఉప్పల్​లోని సీడీఎఫ్​డీని సందర్శించిన ఆయన.. పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ లేబొరేటరీని ప్రారంభించారు.

vice president venkayya naidu
vice president venkayya naidu
author img

By

Published : Feb 20, 2021, 2:18 PM IST

పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ లేబొరేటరీ ప్రారంభ వేడుకలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

నేరస్థులను గుర్తించడంలో సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ పరిశోధనలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. హైదరాబాద్​లోని సీడీఎఫ్​డీని సందర్శించిన ఆయన.. పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ లేబొరేటరీని ప్రారంభించారు. సీడీఎఫ్​డీలో పలు విభాగాలను పరిశీలించారు.

జన్యు రుగ్మతలపై పరిశోధనలతో పాటు నాణ్యమైన సేవలు అందించటం డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌, పరిశోధన కేంద్రం ప్రత్యేకత అని వెంకయ్య అన్నారు ఆధునిక కాలంలో నేరాలు సైతం అనేక రకాలుగా జరుగుతున్నాయన్న ఆయన.. న్యాయవ్యవస్థ, పరిశోధన సంస్థలు నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సీడీఎఫ్‌డీ చేస్తున్న కృషి దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని వెల్లడించారు.

ఇటీవలే 25వ వసంతంలోకి ప్రవేశించిన సీడీఎఫ్‌డీ.... ఇప్పటికే కావాల్సిన అనుభవాన్ని సాధించిందని వెంకయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంస్థపై ప్రజల అంచనాలు సైతం అదేస్థాయిలో పెరుగుతాయని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:

'మాతృభాషను ప్రేమిద్దాం.. మన సంస్కృతిని కాపాడదాం'

పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ లేబొరేటరీ ప్రారంభ వేడుకలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

నేరస్థులను గుర్తించడంలో సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ పరిశోధనలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. హైదరాబాద్​లోని సీడీఎఫ్​డీని సందర్శించిన ఆయన.. పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ లేబొరేటరీని ప్రారంభించారు. సీడీఎఫ్​డీలో పలు విభాగాలను పరిశీలించారు.

జన్యు రుగ్మతలపై పరిశోధనలతో పాటు నాణ్యమైన సేవలు అందించటం డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌, పరిశోధన కేంద్రం ప్రత్యేకత అని వెంకయ్య అన్నారు ఆధునిక కాలంలో నేరాలు సైతం అనేక రకాలుగా జరుగుతున్నాయన్న ఆయన.. న్యాయవ్యవస్థ, పరిశోధన సంస్థలు నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సీడీఎఫ్‌డీ చేస్తున్న కృషి దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని వెల్లడించారు.

ఇటీవలే 25వ వసంతంలోకి ప్రవేశించిన సీడీఎఫ్‌డీ.... ఇప్పటికే కావాల్సిన అనుభవాన్ని సాధించిందని వెంకయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంస్థపై ప్రజల అంచనాలు సైతం అదేస్థాయిలో పెరుగుతాయని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:

'మాతృభాషను ప్రేమిద్దాం.. మన సంస్కృతిని కాపాడదాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.