ETV Bharat / city

ఆశా కార్యకర్త ఇంటి ఎదుట పసికందు.. గ్రహణమొర్రే కారణమా.?

author img

By

Published : Feb 26, 2022, 5:19 PM IST

Infant baby at Asha worker home: మానవత్వం మరిచి అప్పుడే పుట్టిన పసికందును వీధిలో వదిలేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆడపిల్ల పుట్టిందనో.. లేక గ్రహణ మొర్రి ఉందనో విషయం తెలీదు కానీ.. ఇంకా కళ్లయినా తెరవని చిన్నారిని వదిలించుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Infant baby at Asha worker home
ఆశా కార్యకర్త ఇంటి ఎదుట పసికందు.. గ్రహణమొర్రే కారణమా.?

Infant baby at Asha worker home: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసికందును ఆశా కార్యకర్త ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఆ నవజాత శిశువు కేకలు విని బయటకు వచ్చిన ఆశా కార్యకర్త.. వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అనంతరం ఈ విషయాన్ని 1098, 100కు సమాచారం అందించారు. పోలీసులు, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు.

నిందితులను పట్టుకుంటాం..
అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పసికందును వదిలి వెళ్లారని.. పాపకు గ్రహణమొర్రి ఉందని బాలల పరిరక్షణ విభాగం అధికారి నరేశ్​ తెలిపారు. సరైన వైద్యం కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. పరిస్థితి మెరుగుపడ్డాక చైల్డ్ వెల్ఫేర్ సంస్థ ఎదుట హాజరు పరిచి, వరంగల్ శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని పేర్కొన్నారు.

సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టామని బయ్యారం ఎస్సై జగదీశ్​ చెప్పారు. శిశువును వదిలివెళ్లిన నిందితులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి: Illegal Affair: గదిలో అతడు, ఆమె... తాళం వేసిన భర్త.. తర్వాతే ఏమైందంటే..

Infant baby at Asha worker home: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసికందును ఆశా కార్యకర్త ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఆ నవజాత శిశువు కేకలు విని బయటకు వచ్చిన ఆశా కార్యకర్త.. వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అనంతరం ఈ విషయాన్ని 1098, 100కు సమాచారం అందించారు. పోలీసులు, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విచారణ చేపట్టారు.

నిందితులను పట్టుకుంటాం..
అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పసికందును వదిలి వెళ్లారని.. పాపకు గ్రహణమొర్రి ఉందని బాలల పరిరక్షణ విభాగం అధికారి నరేశ్​ తెలిపారు. సరైన వైద్యం కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. పరిస్థితి మెరుగుపడ్డాక చైల్డ్ వెల్ఫేర్ సంస్థ ఎదుట హాజరు పరిచి, వరంగల్ శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని పేర్కొన్నారు.

సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టామని బయ్యారం ఎస్సై జగదీశ్​ చెప్పారు. శిశువును వదిలివెళ్లిన నిందితులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి: Illegal Affair: గదిలో అతడు, ఆమె... తాళం వేసిన భర్త.. తర్వాతే ఏమైందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.