ETV Bharat / city

TSRTC Sankranti Special Buses: సంక్రాంతికి టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. అదనపు ఛార్జీలు లేవు!

author img

By

Published : Jan 6, 2022, 9:31 PM IST

TSRTC Sankranti special buses: సంక్రాంతి సందర్భంగా.. హైదరాబాద్​ నుంచి ఇతర జిల్లాలు సహా ఏపీలోని ముఖ్య ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. ఈనెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.

TSRTC
TSRTC

TSRTC Sankranti special buses: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు టీఎస్​ఆర్టీసీ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతుందని.. ఆర్టీసీ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్​ వెల్లడించారు. ఈనెల 7 నుంచి 14 వరకు బస్సులను నడపనున్నామని తెలిపారు. పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు సహా ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మహాత్మాగాంధీ బస్​స్టేషన్ (MGBS), జూబ్లీ బస్​స్టేషన్ (JBS), సీబీఎస్​, ఉప్పల్​ క్రాస్​​రోడ్, ఎల్​బీనగర్​, ఆరాంఘర్​, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్​, కేపీహెచ్​బీ, ఎస్​ఆర్​నగర్​, అమీర్​పేట, టెలిఫోన్​భవన్, దిల్​సుఖ్​నగర్​ నుంచి బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో నివసించేవారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సు సర్వీసుల పర్యవేక్షణకు సుమారు 200 మంది అధికారులు, సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. www.tsrtconline.in వెబ్​సైట్​లో మందస్తు రిజర్వేషన్​ చేసుకొనే అవకాశం కల్పించినట్లు చెప్పారు.

తెలంగాణలో..

తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట వంటి ముఖ్యపట్టణాలతోపాటు అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.

ఏపీకి ప్రత్యేక సర్వీసులు...

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు... హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్​లోని బీహెచ్​ఈఎస్​, మియాపూర్​, కేపీహెచ్​బీ, దిల్​సుఖ్​నగర్​, ఈసీఐఎల్​, ఎల్​బీనగర్, ఆరాంఘర్​ నుంచి ఏపీకి బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది.

ఇదీచూడండి:

APSRTC MD: సంక్రాంతి ప్రత్యేక బస్సులకు 50 శాతం టికెట్ ధర పెంపు: ఆర్టీసీ ఎండీ

TSRTC Sankranti special buses: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు టీఎస్​ఆర్టీసీ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతుందని.. ఆర్టీసీ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్​ వెల్లడించారు. ఈనెల 7 నుంచి 14 వరకు బస్సులను నడపనున్నామని తెలిపారు. పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు సహా ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మహాత్మాగాంధీ బస్​స్టేషన్ (MGBS), జూబ్లీ బస్​స్టేషన్ (JBS), సీబీఎస్​, ఉప్పల్​ క్రాస్​​రోడ్, ఎల్​బీనగర్​, ఆరాంఘర్​, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్​, కేపీహెచ్​బీ, ఎస్​ఆర్​నగర్​, అమీర్​పేట, టెలిఫోన్​భవన్, దిల్​సుఖ్​నగర్​ నుంచి బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో నివసించేవారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సు సర్వీసుల పర్యవేక్షణకు సుమారు 200 మంది అధికారులు, సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. www.tsrtconline.in వెబ్​సైట్​లో మందస్తు రిజర్వేషన్​ చేసుకొనే అవకాశం కల్పించినట్లు చెప్పారు.

తెలంగాణలో..

తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట వంటి ముఖ్యపట్టణాలతోపాటు అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.

ఏపీకి ప్రత్యేక సర్వీసులు...

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు... హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్​లోని బీహెచ్​ఈఎస్​, మియాపూర్​, కేపీహెచ్​బీ, దిల్​సుఖ్​నగర్​, ఈసీఐఎల్​, ఎల్​బీనగర్, ఆరాంఘర్​ నుంచి ఏపీకి బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది.

ఇదీచూడండి:

APSRTC MD: సంక్రాంతి ప్రత్యేక బస్సులకు 50 శాతం టికెట్ ధర పెంపు: ఆర్టీసీ ఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.