ETV Bharat / city

తెలంగాణ : సెల్​ఫోన్​ బ్యాటరీల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

author img

By

Published : Oct 25, 2020, 8:42 PM IST

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా పిప్పర్ వాడా టోల్ ప్లాజా వద్ద​ లారీ దగ్ధమైంది. దిల్లీ నుంచి తమిళనాడుకు సెల్​ఫోన్ బ్యాటరీల లోడ్​తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగి ప్రమాదానికి గురైంది.

సెల్​ఫోన్​ బ్యాటరీల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం
సెల్​ఫోన్​ బ్యాటరీల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం
తెలంగాణ : సెల్​ఫోన్​ బ్యాటరీల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర్ వాడా టోల్ ప్లాజా దగ్గర ఓ లారీ దగ్ధమయింది. దిల్లీ నుంచి తమిళనాడుకు సెల్​ఫోన్ బ్యాటరీల లోడ్​తో వెళ్తున్న లారీ.. టోల్​ప్లాజా వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో టోల్​ప్లాజా సిబ్బంది పరుగులు తీశారు. ఆదిలాబాద్​లోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే లారీ సహా బ్యాటరీలన్నీ దగ్ధం అయ్యాయి. విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధరించారు.

ఇవీచూడండి: దసరా హోరు.. వాహన విక్రయాల జోరు

తెలంగాణ : సెల్​ఫోన్​ బ్యాటరీల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర్ వాడా టోల్ ప్లాజా దగ్గర ఓ లారీ దగ్ధమయింది. దిల్లీ నుంచి తమిళనాడుకు సెల్​ఫోన్ బ్యాటరీల లోడ్​తో వెళ్తున్న లారీ.. టోల్​ప్లాజా వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో టోల్​ప్లాజా సిబ్బంది పరుగులు తీశారు. ఆదిలాబాద్​లోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే లారీ సహా బ్యాటరీలన్నీ దగ్ధం అయ్యాయి. విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధరించారు.

ఇవీచూడండి: దసరా హోరు.. వాహన విక్రయాల జోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.