ETV Bharat / city

CHINNA JEEYAR SWAMY : సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన త్రిదండి చినజీయర్‌స్వామి

author img

By

Published : Nov 20, 2021, 4:59 PM IST

సీఎం జగన్​ను.. త్రిదండి చినజీయర్‌స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. సహస్రాబ్ధి మహోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన త్రిదండి చినజీయర్‌స్వామి
సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన త్రిదండి చినజీయర్‌స్వామి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా.. హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

2022 ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు సహస్రాబ్ధి ఉత్సవాల నిర్వహణ జరుగుతుందని, ఇందులో భాగంగా వెయ్యి 35 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చినజీయర్‌ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా.. హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

2022 ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు సహస్రాబ్ధి ఉత్సవాల నిర్వహణ జరుగుతుందని, ఇందులో భాగంగా వెయ్యి 35 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చినజీయర్‌ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

ఇదీచదవండి.

TIRUPATI RAINS: జలదిగ్బంధంలో తిరుపతి.. వరద ముంపులో కాలనీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.