ETV Bharat / city

APRDC: ఏపీఆర్‌డీసీకి ఆస్తుల బదలాయింపు! - ఏపీఆర్‌డీసీకి ఆస్తుల బదలాయింపు

ఏపీఆర్‌డీసీ పేరిట రూ.3,786.15 కోట్ల విలువైన ఆస్తుల బదలాయింపు వెనుక భారీ ప్రణాళికలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీఎస్‌డీసీ తరహాలోనే ఈ ప్రక్రియ సాగుతోంది. ఆ కార్పొరేషన్‌ ద్వారా రూ.వేల కోట్లు రుణం తీసుకువచ్చినట్లే ఈ భూములనూ తనఖా పెట్టి మరిన్ని రుణ ప్రణాళికలు రచించనున్నారని ఆర్థిక నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీఆర్‌డీసీకి ఆస్తుల బదలాయింపు
ఏపీఆర్‌డీసీకి ఆస్తుల బదలాయింపు
author img

By

Published : Oct 8, 2021, 8:27 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఆర్‌డీసీ) పేరిట రూ.3,786.15 కోట్ల విలువైన ఆస్తుల బదలాయింపు వెనుక భారీ ప్రణాళికలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రహదారుల అభివృద్ధి శాఖకు ఉన్న రూ.3,393.65 కోట్ల విలువైన 574.37 ఎకరాలు, అందులో ఉన్న రూ.392.50 కోట్ల విలువైన భవనాలను కార్పొరేషన్‌కు బదలాయించారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) తరహాలోనే ఈ ప్రక్రియ సాగుతోంది. ఆ కార్పొరేషన్‌ ద్వారా రూ.వేల కోట్లు రుణం తీసుకువచ్చినట్లే ఈ భూములనూ తనఖా పెట్టి మరిన్ని రుణ ప్రణాళికలు రచించనున్నారని ఆర్థిక నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్‌, మే నెలలోనే రుణ ప్రతిపాదనలు

రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి రూ.3,000 కోట్ల రుణం తీసుకుంటామని, ఇందుకు ప్రభుత్వ హామీ అవసరమని రవాణాశాఖ ఉన్నతాధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లోనే ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ గ్యారంటీల పరిమితి దాటిపోయినందున ఇక కార్పొరేషన్‌కు గ్యారంటీ ఇవ్వలేమని ఆర్థికశాఖ అధికారులు తేల్చిచెప్పారు. అప్పటికే దాదాపు 1.19 లక్షల కోట్లకు గ్యారంటీలతో పాటు పుస్తకాల్లో నమోదవని మరికొన్ని గ్యారంటీలు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో డీజిల్‌, పెట్రోలు సెస్‌ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. లీటరుకు రూపాయి చొప్పున సెస్‌ విధించి ఆ ఆదాయాన్ని చెల్లింపులకు ఆధారంగా చూపి రుణం తీసుకోవచ్చని సూచించారు. ఏడాదికి ఈ సెస్‌ రూపంలో రూ.700 కోట్ల వరకు ఆదాయం వస్తుందని, ఇందులో రూ.370 కోట్లతో రుణాలు చెల్లించవచ్చని లెక్కించారు. ఆ సెస్‌ విధించి రూ.3,000 కోట్ల రుణం ప్రతిపాదించారు. అందులో రూ.1,100 కోట్లు తీసుకున్నారు. మిగిలినది తీసుకునేందుకు ఈ స్థాయిలో భూముల బదలాయింపు, తనఖా ప్రయత్నాలు అవసరం లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రూ.19 వేల కోట్లు అవసరం

ప్రభుత్వానికి వివిధ అవసరాల కోసం పెద్ద మొత్తంలో నిధులు కావాలి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి రూ.18,500 కోట్లు తీసుకుని వివిధ కార్యక్రమాలకు మళ్లించారు. అవే కార్యక్రమాలకు ఈ ఏడాది సుమారు రూ.19వేల కోట్లు అవసరమవుతాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ఏపీఎస్‌డీసీ తన ఒప్పందాల మేరకు ఇప్పటికే రూ.25 వేల కోట్ల రుణం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,500 కోట్లు రుణం తీసుకునే ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌డీసీ నమూనానే ఏపీఆర్‌డీసీకి వర్తింపజేస్తున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏపీఆర్‌డీసీకి తీసుకునే రుణాలు తిరిగి చెల్లింపునకు పెట్రోలు, డీజిల్‌ సెస్‌ ఆదాయం చూపారు. ఇప్పుడు ఇంత స్థాయిలో ఆస్తుల బదలాయింపు చేపట్టారంటే వాటిని బ్యాంకులకు తనఖా పెట్టి, మరిన్ని వేల కోట్ల రూపాయలు సమీకరించే ప్రయత్నాలు జరగొచ్చని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: Web counseling: అన్ని ఖాళీలకూ వెబ్‌ కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఆర్‌డీసీ) పేరిట రూ.3,786.15 కోట్ల విలువైన ఆస్తుల బదలాయింపు వెనుక భారీ ప్రణాళికలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రహదారుల అభివృద్ధి శాఖకు ఉన్న రూ.3,393.65 కోట్ల విలువైన 574.37 ఎకరాలు, అందులో ఉన్న రూ.392.50 కోట్ల విలువైన భవనాలను కార్పొరేషన్‌కు బదలాయించారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) తరహాలోనే ఈ ప్రక్రియ సాగుతోంది. ఆ కార్పొరేషన్‌ ద్వారా రూ.వేల కోట్లు రుణం తీసుకువచ్చినట్లే ఈ భూములనూ తనఖా పెట్టి మరిన్ని రుణ ప్రణాళికలు రచించనున్నారని ఆర్థిక నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్‌, మే నెలలోనే రుణ ప్రతిపాదనలు

రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి రూ.3,000 కోట్ల రుణం తీసుకుంటామని, ఇందుకు ప్రభుత్వ హామీ అవసరమని రవాణాశాఖ ఉన్నతాధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లోనే ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ గ్యారంటీల పరిమితి దాటిపోయినందున ఇక కార్పొరేషన్‌కు గ్యారంటీ ఇవ్వలేమని ఆర్థికశాఖ అధికారులు తేల్చిచెప్పారు. అప్పటికే దాదాపు 1.19 లక్షల కోట్లకు గ్యారంటీలతో పాటు పుస్తకాల్లో నమోదవని మరికొన్ని గ్యారంటీలు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో డీజిల్‌, పెట్రోలు సెస్‌ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. లీటరుకు రూపాయి చొప్పున సెస్‌ విధించి ఆ ఆదాయాన్ని చెల్లింపులకు ఆధారంగా చూపి రుణం తీసుకోవచ్చని సూచించారు. ఏడాదికి ఈ సెస్‌ రూపంలో రూ.700 కోట్ల వరకు ఆదాయం వస్తుందని, ఇందులో రూ.370 కోట్లతో రుణాలు చెల్లించవచ్చని లెక్కించారు. ఆ సెస్‌ విధించి రూ.3,000 కోట్ల రుణం ప్రతిపాదించారు. అందులో రూ.1,100 కోట్లు తీసుకున్నారు. మిగిలినది తీసుకునేందుకు ఈ స్థాయిలో భూముల బదలాయింపు, తనఖా ప్రయత్నాలు అవసరం లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రూ.19 వేల కోట్లు అవసరం

ప్రభుత్వానికి వివిధ అవసరాల కోసం పెద్ద మొత్తంలో నిధులు కావాలి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి రూ.18,500 కోట్లు తీసుకుని వివిధ కార్యక్రమాలకు మళ్లించారు. అవే కార్యక్రమాలకు ఈ ఏడాది సుమారు రూ.19వేల కోట్లు అవసరమవుతాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ఏపీఎస్‌డీసీ తన ఒప్పందాల మేరకు ఇప్పటికే రూ.25 వేల కోట్ల రుణం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,500 కోట్లు రుణం తీసుకునే ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌డీసీ నమూనానే ఏపీఆర్‌డీసీకి వర్తింపజేస్తున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏపీఆర్‌డీసీకి తీసుకునే రుణాలు తిరిగి చెల్లింపునకు పెట్రోలు, డీజిల్‌ సెస్‌ ఆదాయం చూపారు. ఇప్పుడు ఇంత స్థాయిలో ఆస్తుల బదలాయింపు చేపట్టారంటే వాటిని బ్యాంకులకు తనఖా పెట్టి, మరిన్ని వేల కోట్ల రూపాయలు సమీకరించే ప్రయత్నాలు జరగొచ్చని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: Web counseling: అన్ని ఖాళీలకూ వెబ్‌ కౌన్సెలింగ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.