ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM

.

author img

By

Published : Jun 20, 2020, 5:00 PM IST

TOP NEWS @ 5 PM
ప్రధాన వార్తలు@5pm
  • పది పరీక్షలు రద్దు చేస్తారా..!

పదో తరగతి పరీక్షలపై కీలక ప్రకటన చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో విద్యాశాఖ మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో పది పరీక్షలు రద్దు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పోలీసుల కస్టడీకి...

బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా ఫోర్జరీ చేసి అమ్మిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు వీరిని ప్రశ్నించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • బాకీ తీర్చలేదని యువకుడు కిడ్నాప్

రాష్ట్రంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే యువతపై సినిమాల ప్రభావం చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. సెల్​ఫోన్ కొని డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ యువకున్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్రభుత్వ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల ఎంపీడీవో వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నూతన పింఛన్లను పంపిణీ చేస్తూ ఓ వృద్ధురాలి దగ్గరకు వెళ్లిన ఆయన.. ఓటు జగన్​కే వేయాలంటూ సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

  • పడుకుని లాయర్​ వాదనలు

ఓ కేసు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్​లో మంచంపై పడుకుని, టీషర్టు ధరించి సుప్రీం ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు ఓ న్యాయవాది. అతని తీరుపై న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. కనీస మర్యాదలు పాటించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చైనా చొరబాటుపై క్లారిటీ

భారత భూభాగంలోకి ఎవరూ చొరబడ లేదని, సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించలేదని ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై... విపక్షాలు వక్రభాష్యం చెప్పడం సరికాదని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'గ్రామాభివృద్ధికి దారి చూపిన లాక్​డౌన్​'

లాక్​డౌన్​తో నగరాల్లో ఉన్న ప్రతిభ అంతా గ్రామాలకు చేరుకుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇందువల్ల ఇక గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చైనా.. నీ తీరు మారేనా?

భారత్​-చైనా మధ్య సరిహద్దు అంశంపై తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఇతర దేశాలతో గొడవలు పెట్టుకోవడం చైనాకు ఇది కొత్తేమీ కాదు. పొరుగు దేశాలతోనే కాకుండా.. సరిహద్దు లేని దేశాలపైనా కయ్యానికి కాలు దువ్వడం చైనాకు సాధారణ విషయం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మైక్రోమ్యాక్స్​ దశ తిరిగేనా?

'మైక్రోమ్యాక్స్'... ఒకప్పుడు మొబైల్ ఫోన్ల మార్కెట్​లో ఓ వెలుగు వెలిగిన దేశీయ సంస్థ. చైనా కంపెనీల తాకిడితో కొంతకాలంగా రేసులో అట్టడుగుకు పడిపోయింది. అయితే 'వోకల్ ఫర్ లోకల్', 'బాయ్​కాట్​ చైనా' ఉద్యమాలతో మళ్లీ మార్కెట్​పై తన ముద్ర వేసేందుకు కృషి చేస్తోంది మైక్రోమ్యాక్స్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఏళ్లపాటు నిద్రలేని రాత్రులు!

ఒకానొక సమయంలో క్రికెట్​ను ఆస్వాదించలేకపోవడం వల్లే రిటైర్మెంట్​ ప్రకటించినట్లు చెప్పాడు యువరాజ్​ సింగ్​. ఆడుతున్న సమయంలో తనకు నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయని తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పది పరీక్షలు రద్దు చేస్తారా..!

పదో తరగతి పరీక్షలపై కీలక ప్రకటన చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో విద్యాశాఖ మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో పది పరీక్షలు రద్దు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పోలీసుల కస్టడీకి...

బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా ఫోర్జరీ చేసి అమ్మిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు వీరిని ప్రశ్నించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • బాకీ తీర్చలేదని యువకుడు కిడ్నాప్

రాష్ట్రంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే యువతపై సినిమాల ప్రభావం చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. సెల్​ఫోన్ కొని డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ యువకున్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్రభుత్వ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల ఎంపీడీవో వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నూతన పింఛన్లను పంపిణీ చేస్తూ ఓ వృద్ధురాలి దగ్గరకు వెళ్లిన ఆయన.. ఓటు జగన్​కే వేయాలంటూ సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

  • పడుకుని లాయర్​ వాదనలు

ఓ కేసు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్​లో మంచంపై పడుకుని, టీషర్టు ధరించి సుప్రీం ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు ఓ న్యాయవాది. అతని తీరుపై న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. కనీస మర్యాదలు పాటించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చైనా చొరబాటుపై క్లారిటీ

భారత భూభాగంలోకి ఎవరూ చొరబడ లేదని, సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించలేదని ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై... విపక్షాలు వక్రభాష్యం చెప్పడం సరికాదని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'గ్రామాభివృద్ధికి దారి చూపిన లాక్​డౌన్​'

లాక్​డౌన్​తో నగరాల్లో ఉన్న ప్రతిభ అంతా గ్రామాలకు చేరుకుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇందువల్ల ఇక గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చైనా.. నీ తీరు మారేనా?

భారత్​-చైనా మధ్య సరిహద్దు అంశంపై తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఇతర దేశాలతో గొడవలు పెట్టుకోవడం చైనాకు ఇది కొత్తేమీ కాదు. పొరుగు దేశాలతోనే కాకుండా.. సరిహద్దు లేని దేశాలపైనా కయ్యానికి కాలు దువ్వడం చైనాకు సాధారణ విషయం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మైక్రోమ్యాక్స్​ దశ తిరిగేనా?

'మైక్రోమ్యాక్స్'... ఒకప్పుడు మొబైల్ ఫోన్ల మార్కెట్​లో ఓ వెలుగు వెలిగిన దేశీయ సంస్థ. చైనా కంపెనీల తాకిడితో కొంతకాలంగా రేసులో అట్టడుగుకు పడిపోయింది. అయితే 'వోకల్ ఫర్ లోకల్', 'బాయ్​కాట్​ చైనా' ఉద్యమాలతో మళ్లీ మార్కెట్​పై తన ముద్ర వేసేందుకు కృషి చేస్తోంది మైక్రోమ్యాక్స్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఏళ్లపాటు నిద్రలేని రాత్రులు!

ఒకానొక సమయంలో క్రికెట్​ను ఆస్వాదించలేకపోవడం వల్లే రిటైర్మెంట్​ ప్రకటించినట్లు చెప్పాడు యువరాజ్​ సింగ్​. ఆడుతున్న సమయంలో తనకు నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయని తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.