తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని గణేశ్ నగర్ కాలనీలో దొంగతనం జరిగింది. రంగారెడ్డి అనే రైతు ఇంట్లో 33 తులాల బంగారం అపహరణకు గురైంది. పొలం పనులకు ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేలోగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి.

నెక్లెస్, ఉంగరాలు, చైన్లు, కమ్మల బుట్టలతో కలిపి మొత్తం 33 తులాల బంగారం చోరీ జరిగినట్లు బాధితుడు పేర్కొన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.