ETV Bharat / city

good governance ranks : గుడ్​ గవర్నెన్స్​ సూచీలో ఏపీ స్థానం ఎంతో తెలుసా..

author img

By

Published : Dec 26, 2021, 5:17 AM IST

good governance ranks : సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రజా ఫిర్యాదులు, పరిపాలన సంస్కరణలశాఖ రూపొందించిన సుపరిపాలన సూచీని(జీజీఐ) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం విడుదల చేశారు. ఈ సూచీలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ 9, 10 స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వ పాలనలోని 10 రంగాల్లో 58 సూచికల ఆధారంగా ర్యాంకింగ్‌ను నిర్ణయించారు.

ap
ap

good governance ranks :2020-21 సంవత్సరానికిగాను గుడ్​ గవర్నెన్స్​ సూచీని కేంద్రం విడుదల చేసింది. మొత్తం పది రంగాల్లో గుడ్ గవర్నెన్స్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ సూచీలో గుజరాత్‌, మహారాష్ట్ర తొలి రెండు స్థానాలు పొందగా.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ 9, 10 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానం దక్కింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వాలకు కేంద్రం ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది.

సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రజా ఫిర్యాదులు, పరిపాలన సంస్కరణలశాఖ రూపొందించిన సుపరిపాలన సూచీని(జీజీఐ) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం విడుదల చేశారు. ప్రభుత్వ పాలనలోని 10 రంగాల్లో 58 సూచికల ఆధారంగా ర్యాంకింగ్‌ను నిర్ణయించారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 4 విభాగాలుగా విభజించారు. గ్రూప్‌-ఎలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గోవా, గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు ఉన్నాయి. గ్రూప్‌-ఎలో గుజరాత్‌.., గ్రూప్‌-బిలో మధ్యప్రదేశ్‌, ఈశాన్య, పర్వత రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిల్లీ ప్రథమ స్థానాల్లో నిలిచాయి.

సాగులో ఏపీ మేటి
వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 సూచికల ఆధారంగా ర్యాంకింగ్‌ ఇచ్చారు. ఈ విభాగంలో 0.634 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలవగా, 0.413 స్కోరుతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు జీజీఐ 2019లో 6.3% ఉండగా 2021లో అది 11.3%కి పెరిగింది. ఉద్యాన విభాగంలో ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7% నుంచి 12.3%కి పెరిగింది. పాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 1.4% నుంచి 11.7%కి చేరుకోగా.. మాంసం ఉత్పత్తికి సంబంధించి 2019 జీజీఐలో -6.7% ఉండగా ప్రస్తుతం 10.3%కి పెరిగింది.

పరిశ్రమల్లో తెలంగాణదే పైచేయి
జీఎస్టీ కింద నమోదైన అంకుర పరిశ్రమలు, సంస్థల సంఖ్య, సులభతర వాణిజ్యం, వ్యాపార, పారిశ్రామికాభివృద్ధి, ఇతర పాలన అంశాల ఆధారంగా ర్యాంకింగ్‌ ఇచ్చారు. 2019లో తెలంగాణలో పారిశ్రామిక వార్షిక వృద్ధి రేటు 0.13% ఉండగా 2020-21లో అది 8.78%కి చేరుకుంది. గ్రూప్‌-ఎలో ఈ రంగంలో మొత్తంగా 0.699 స్కోరుతో తెలంగాణ తొలి స్థానం దక్కించుకోగా.. 0.662 స్కోరుతో గుజరాత్‌ ద్వితీయ, 0.627 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌ ఆరోస్థానంలో నిలిచాయి. సాంఘిక సంక్షేమం, అభివృద్ధిలో 0.617 స్కోరుతో తెలంగాణ ప్రథమ, 0.546 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయ స్థానం పొందింది.

...

ఇదీ చదవండి

mp sujana chowdary : వైకాపా పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కుపోయింది : సుజనా

good governance ranks :2020-21 సంవత్సరానికిగాను గుడ్​ గవర్నెన్స్​ సూచీని కేంద్రం విడుదల చేసింది. మొత్తం పది రంగాల్లో గుడ్ గవర్నెన్స్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ సూచీలో గుజరాత్‌, మహారాష్ట్ర తొలి రెండు స్థానాలు పొందగా.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ 9, 10 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానం దక్కింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వాలకు కేంద్రం ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది.

సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రజా ఫిర్యాదులు, పరిపాలన సంస్కరణలశాఖ రూపొందించిన సుపరిపాలన సూచీని(జీజీఐ) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం విడుదల చేశారు. ప్రభుత్వ పాలనలోని 10 రంగాల్లో 58 సూచికల ఆధారంగా ర్యాంకింగ్‌ను నిర్ణయించారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 4 విభాగాలుగా విభజించారు. గ్రూప్‌-ఎలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గోవా, గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు ఉన్నాయి. గ్రూప్‌-ఎలో గుజరాత్‌.., గ్రూప్‌-బిలో మధ్యప్రదేశ్‌, ఈశాన్య, పర్వత రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిల్లీ ప్రథమ స్థానాల్లో నిలిచాయి.

సాగులో ఏపీ మేటి
వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 సూచికల ఆధారంగా ర్యాంకింగ్‌ ఇచ్చారు. ఈ విభాగంలో 0.634 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలవగా, 0.413 స్కోరుతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు జీజీఐ 2019లో 6.3% ఉండగా 2021లో అది 11.3%కి పెరిగింది. ఉద్యాన విభాగంలో ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7% నుంచి 12.3%కి పెరిగింది. పాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 1.4% నుంచి 11.7%కి చేరుకోగా.. మాంసం ఉత్పత్తికి సంబంధించి 2019 జీజీఐలో -6.7% ఉండగా ప్రస్తుతం 10.3%కి పెరిగింది.

పరిశ్రమల్లో తెలంగాణదే పైచేయి
జీఎస్టీ కింద నమోదైన అంకుర పరిశ్రమలు, సంస్థల సంఖ్య, సులభతర వాణిజ్యం, వ్యాపార, పారిశ్రామికాభివృద్ధి, ఇతర పాలన అంశాల ఆధారంగా ర్యాంకింగ్‌ ఇచ్చారు. 2019లో తెలంగాణలో పారిశ్రామిక వార్షిక వృద్ధి రేటు 0.13% ఉండగా 2020-21లో అది 8.78%కి చేరుకుంది. గ్రూప్‌-ఎలో ఈ రంగంలో మొత్తంగా 0.699 స్కోరుతో తెలంగాణ తొలి స్థానం దక్కించుకోగా.. 0.662 స్కోరుతో గుజరాత్‌ ద్వితీయ, 0.627 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌ ఆరోస్థానంలో నిలిచాయి. సాంఘిక సంక్షేమం, అభివృద్ధిలో 0.617 స్కోరుతో తెలంగాణ ప్రథమ, 0.546 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయ స్థానం పొందింది.

...

ఇదీ చదవండి

mp sujana chowdary : వైకాపా పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కుపోయింది : సుజనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.