ETV Bharat / city

కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో దక్కని నిధులు

author img

By

Published : Apr 13, 2020, 4:36 AM IST

రాష్ట్రంలో అమ్మకపు పన్ను, మోటారు వాహనాల పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తక్కువే. ఎక్సైజ్‌ ఆదాయమే కొంత పెరిగింది. కేంద్రం నుంచి ఆశించినవీ రాలేదు. కేంద్ర సాయం పైనా, కేంద్ర పన్నుల్లో వాటాపైనా రాష్ట్రం ఎక్కువ ఆశ పడుతోంది. ఆ మేరకు ఆసరా అందడం లేదు. అంతకుముందు ఏడాది కాస్త ఎక్కువ మొత్తాలు వచ్చినట్లు ఆర్థికశాఖ లెక్కలు పేర్కొంటున్నాయి. కేంద్రగ్రాంట్లు రూ.60వేల కోట్లకు పైగా వస్తాయనుకుంటే, అందులో మూడోవంతూ రాలేదు.

The amount of funds expected from the Center is not allocated
కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో దక్కని నిధులు

రాష్ట్రంలో మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (2019-20) రాష్ట్ర సొంత ఆదాయం, పన్ను ఆదాయాలు, పన్నేతర ఆదాయాలే కాదు... కేంద్రం నుంచీ ఆశించిన స్థాయిలో నిధులు దక్కలేదు. బడ్జెట్‌ సమర్పణ సమయంలో వేసుకున్న అంచనాలన్నీ తప్పాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2018-19)లో వచ్చిన స్థాయిలోనూ ఆదాయం రాలేదు. ప్రజారుణంతోనే ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చింది. ప్రజాపద్దు ద్వారా సమకూరిన మొత్తాలు, పెరిగిన రుణాలు కలిపితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వసూళ్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.30వేల కోట్ల వరకు పెరిగినట్లు ఆర్థికశాఖ అధికారులు లెక్కలు వేశారు.

సాధారణంగా బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఆదాయం తగ్గినా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా అంతో ఇంతో కాస్త ఎక్కువే వస్తుందని భావిస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటికీ దూరంగానే సాధించిన ఆదాయం ఉంది. రాష్ట్రంలో అమ్మకపు పన్ను, మోటారు వాహనాల పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తక్కువే. ఎక్సైజ్‌ ఆదాయమే కొంత పెరిగింది.

కేంద్రం నుంచి ఆశించినవీ రాలేదు. కేంద్ర సాయం పైనా, కేంద్ర పన్నుల్లో వాటాపైనా రాష్ట్రం ఎక్కువ ఆశ పడుతోంది. ఆ మేరకు ఆసరా అందడం లేదు. అంతకుముందు ఏడాది కాస్త ఎక్కువ మొత్తాలు వచ్చినట్లు ఆర్థికశాఖ లెక్కలు పేర్కొంటున్నాయి. కేంద్రగ్రాంట్లు రూ.60వేల కోట్లకు పైగా వస్తాయనుకుంటే, అందులో మూడోవంతూ రాలేదు.

అప్పులు పెరిగాయి...

వివిధ రూపాల్లో ప్రభుత్వం తీసుకున్న రుణాన్నే ప్రజారుణంగా పరిగణిస్తాం. ఇందులో రిజర్వుబ్యాంకు నుంచి చేబదులుగా తీసుకున్నదీ ఉంటుంది. దీన్ని తర్వాత సర్దుబాటు చేస్తారు. అలా ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తమే రూ.60,302.91 కోట్లు. అది కాక కేంద్రం నుంచి రూ.1,547.18 కోట్లు రుణంగా పొందారు. ఇందులో మార్కెట్‌ నుంచి వడ్డీలకు తెచ్చిన అప్పులూ ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వడ్డీలకు మార్కెట్‌ ద్వారా రూ.31,421.79 కోట్లు సమీకరించగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో అది రూ.43,271.77 కోట్లకు చేరింది.

నాబార్డు ద్వారా రూ.900.54 కోట్ల రుణం పొందినట్లు లెక్కల్లో పేర్కొన్నారు. సెక్యూరిటీల వేలం ద్వారా పొందే అప్పు, నాబార్డు వంటి సంస్థల ద్వారా పొందిన రుణాలను అంతర్గత రుణాలుగా పరిగణిస్తాం. పి.డి.ఖాతాల్లో ఉన్న మొత్తం, పీఎఫ్‌, స్థానిక సంస్థల ద్వారా వసూలయ్యే పన్నులు, ఇతరత్రా మొత్తాలు, డిపాజిట్లు, అడ్వాన్సుల రూపంలో ఉన్న మొత్తాన్ని ప్రజాపద్దుగా పరిగణిస్తారు. పరిస్థితులకు తగ్గట్లుగా దీన్ని వినియోగించుకుంటారు. ప్రస్తుత లెక్కల్లో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి వివిధ కార్పొరేషన్ల ద్వారా పొందిన రుణాల మొత్తం లేదు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో 427కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (2019-20) రాష్ట్ర సొంత ఆదాయం, పన్ను ఆదాయాలు, పన్నేతర ఆదాయాలే కాదు... కేంద్రం నుంచీ ఆశించిన స్థాయిలో నిధులు దక్కలేదు. బడ్జెట్‌ సమర్పణ సమయంలో వేసుకున్న అంచనాలన్నీ తప్పాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2018-19)లో వచ్చిన స్థాయిలోనూ ఆదాయం రాలేదు. ప్రజారుణంతోనే ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చింది. ప్రజాపద్దు ద్వారా సమకూరిన మొత్తాలు, పెరిగిన రుణాలు కలిపితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వసూళ్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.30వేల కోట్ల వరకు పెరిగినట్లు ఆర్థికశాఖ అధికారులు లెక్కలు వేశారు.

సాధారణంగా బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఆదాయం తగ్గినా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా అంతో ఇంతో కాస్త ఎక్కువే వస్తుందని భావిస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటికీ దూరంగానే సాధించిన ఆదాయం ఉంది. రాష్ట్రంలో అమ్మకపు పన్ను, మోటారు వాహనాల పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తక్కువే. ఎక్సైజ్‌ ఆదాయమే కొంత పెరిగింది.

కేంద్రం నుంచి ఆశించినవీ రాలేదు. కేంద్ర సాయం పైనా, కేంద్ర పన్నుల్లో వాటాపైనా రాష్ట్రం ఎక్కువ ఆశ పడుతోంది. ఆ మేరకు ఆసరా అందడం లేదు. అంతకుముందు ఏడాది కాస్త ఎక్కువ మొత్తాలు వచ్చినట్లు ఆర్థికశాఖ లెక్కలు పేర్కొంటున్నాయి. కేంద్రగ్రాంట్లు రూ.60వేల కోట్లకు పైగా వస్తాయనుకుంటే, అందులో మూడోవంతూ రాలేదు.

అప్పులు పెరిగాయి...

వివిధ రూపాల్లో ప్రభుత్వం తీసుకున్న రుణాన్నే ప్రజారుణంగా పరిగణిస్తాం. ఇందులో రిజర్వుబ్యాంకు నుంచి చేబదులుగా తీసుకున్నదీ ఉంటుంది. దీన్ని తర్వాత సర్దుబాటు చేస్తారు. అలా ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తమే రూ.60,302.91 కోట్లు. అది కాక కేంద్రం నుంచి రూ.1,547.18 కోట్లు రుణంగా పొందారు. ఇందులో మార్కెట్‌ నుంచి వడ్డీలకు తెచ్చిన అప్పులూ ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వడ్డీలకు మార్కెట్‌ ద్వారా రూ.31,421.79 కోట్లు సమీకరించగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో అది రూ.43,271.77 కోట్లకు చేరింది.

నాబార్డు ద్వారా రూ.900.54 కోట్ల రుణం పొందినట్లు లెక్కల్లో పేర్కొన్నారు. సెక్యూరిటీల వేలం ద్వారా పొందే అప్పు, నాబార్డు వంటి సంస్థల ద్వారా పొందిన రుణాలను అంతర్గత రుణాలుగా పరిగణిస్తాం. పి.డి.ఖాతాల్లో ఉన్న మొత్తం, పీఎఫ్‌, స్థానిక సంస్థల ద్వారా వసూలయ్యే పన్నులు, ఇతరత్రా మొత్తాలు, డిపాజిట్లు, అడ్వాన్సుల రూపంలో ఉన్న మొత్తాన్ని ప్రజాపద్దుగా పరిగణిస్తారు. పరిస్థితులకు తగ్గట్లుగా దీన్ని వినియోగించుకుంటారు. ప్రస్తుత లెక్కల్లో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి వివిధ కార్పొరేషన్ల ద్వారా పొందిన రుణాల మొత్తం లేదు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో 427కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.