ETV Bharat / city

తెలంగాణ: సూర్యాపేటలో  ‘అమర వీరులకు కాంగ్రెస్ సలాం’ పేరిట నివాళి

author img

By

Published : Jun 26, 2020, 6:10 PM IST

భారత - చైనా సరిహద్దు ఘర్షణలో అమరులైన వీర సైనికులకు నివాళిగా ‘అమరవీరులకు కాంగ్రెస్ సలాం' పేరిట తెలంగాణలోని సూర్యాపేటలో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మౌనదీక్షను చేయాలని శ్రేణులకు సూచించారు.

Telangana: Congress party pays tributes to immortals of Galvan in suryapet
తెలంగాణ: సూర్యాపేటలో గల్వాన్ వీరులకు ‘అమర వీరులకు కాంగ్రెస్ సలాం’ పేరిట నివాళి

భారత్‌ - చైనా సరిహద్దులోని గల్వాన్​ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో అమరులైన వీరసైనికులకు కాంగ్రెస్​ పార్టీ నివాళులర్పించనుంది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు సహా 21 మంది భారత సైనికులకు నివాళిగా 'అమరవీరులకు కాంగ్రెస్​ సలాం' పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వైఫల్యం వల్లనే సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకుందని ఉత్తమ్ ఆరోపించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మహాత్మా గాంధీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల వద్ద మౌనదీక్ష చేయాలని కోరారు.

ఈ నెల 28న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: శానిటైజర్ల మాటున మాదకద్రవ్యాల సరఫరా

భారత్‌ - చైనా సరిహద్దులోని గల్వాన్​ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో అమరులైన వీరసైనికులకు కాంగ్రెస్​ పార్టీ నివాళులర్పించనుంది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు సహా 21 మంది భారత సైనికులకు నివాళిగా 'అమరవీరులకు కాంగ్రెస్​ సలాం' పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వైఫల్యం వల్లనే సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకుందని ఉత్తమ్ ఆరోపించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మహాత్మా గాంధీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల వద్ద మౌనదీక్ష చేయాలని కోరారు.

ఈ నెల 28న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: శానిటైజర్ల మాటున మాదకద్రవ్యాల సరఫరా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.