ETV Bharat / city

TDP Leaders On Jagan : ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. తెదేపా నేతల ఆగ్రహం

author img

By

Published : Oct 22, 2021, 12:34 PM IST

Updated : Oct 22, 2021, 1:26 PM IST

రాష్ట్రంలో అరాచర పాలన నడుస్తోందని తెదేపా నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపితే.. అక్రమ కేసులు పెడుతున్నారన్న నేతలు.. జగన్ చేయించే దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

TDP Leaders On Jagan
ప్రశ్నిస్తే దాడులు చేస్తారా...

ముఖ్యమంత్రి జగన్ పై తెదేపా నేతలు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచర పాలన నడుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపితే.. అక్రమ కేసులు పెడుతున్నారన్న నేతలు.. జగన్ చేయించే దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. బాబు దీక్ష చేపట్టిన మంగళగిరిలోని తెదేపా కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు దీక్షా స్థలి వద్ద, మీడియా సమావేశాల్లో ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు.

అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తరిమి కొడతాం -దేవినేని ఉమా, మాజీ మంత్రి
రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామ ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ రెడ్డి పాలనలో అరాచకత్వం రాజ్యమేలుతోందన్నారు. పట్టాభి ఇంటిపై దాడి చేశారు, పార్టీ కార్యాలయంపై గంజాయి బ్యాచ్ తో దాడి చేశారు. దాడులు చేస్తే భయపడబోమని స్పష్టం చేశారు. మంత్రులు బరితెగించి బూతులు తిడుతున్నారన్న ఆయన.. అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తరిమి కొడతామని పేర్కొన్నారు. 11 సీబీఐ, 6 ఈడీ, 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్నది జగన్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి మాట్లాడితే వాటిని పక్కదారి పట్టించడానికి దాడులు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోప్రజాస్వామ్యానికి దెబ్బతగిలింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలన్నారు.

పచ్చడి అయిపోతారు -పీతల సుజాత, మాజీ మంత్రి
వైకాపా వచ్చాక రాష్ట్రం.. డ్రగ్స్, శాండ్, మైన్, లిక్కర్ మాఫియాకు కేంద్రంగా మారిందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి పోలీసులు అంటకాగుతున్నారని విమర్శించారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు దీక్ష చేస్తున్నారని తెలిపారు. కేసులు నుండి తప్పించుకోవడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసం పోరాడే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పులు చూపెడితే.. అక్రమ కేసులు పెడుతున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాయకులకు బీపీలు వస్తే కొడతారు.. మా నాయకులు మాములుగా వస్తేనే పచ్చడి అయిపోతారని హెచ్చరించారు.

ఆటవిక పాలనా..? ప్రజాస్వామ్యమా..? - గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు
దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మానవ హక్కులను హరిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. ఆటవిక పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ ఉగ్రవాదంగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో, బయట వైకాపా నేతలు చంద్రబాబుని తిట్టిన తిట్లేంటని నిలదీశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును తుపాకీతో కాల్చాలని, ఉరితీయాలని, ముఖ్యకంత్రీ అని జగన్ రెడ్డి అనలేదా? అని గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిలదీశారు.

ఇదీ చదవండి : చంద్రబాబుకు సీపీఐ నారాయణ ఫోన్.. ఏమన్నారంటే?

దాడులకు భయపడే వారు ఎవరూ లేరు - ఆచంట సునీత, అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు
అవినీతి, అరాచకపు వ్యక్తి ముఖ్యమంత్రయితే రాష్ట్రం ఎలా ఉంటుందో జగన్ పాలనే ఉదాహరణ అని అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్ష్యురాలు ఆచంట సునీత అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని, తప్పుల్ని ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. మీ దాడులకు భయపడే వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చితే జగన్ రెడ్డి, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. తెదేపా అధికారంలో ఉన్నపుడు మేం మీలా వ్యవహరిస్తే జగన్ , షర్మిల పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. వైకాపా ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం చేసే అరాచకం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్న ఆమె.. 151 మంది ఎమ్మెల్యేలు ఒక్కో రాజారెడ్డి లాగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

వైకాపా వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలి - దివ్యవాణి, తెదేపా అధికార ప్రతినిధి
ఇసుక కొరతతో రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ ప్రక్క రాష్ట్రాలకు పారిపోతున్నారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. యువకులకు ఉద్యోగాలు లేవు, రోడ్లు సరిగా లేవని మండిపడ్డారు. ఒక్కసారి ఛాన్స్ తో వచ్చి ప్రజలను మోసం చేసినందుకు, అమరావతి రైతులను రోడ్లపై కూర్చోబెట్టినందుకు జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ ఆధార్ లు చించుతామన్న వైకాపా వాళ్లు.. నాలుకలు అదుపులో పెట్టుకోవాలని దివ్యవాణి హెచ్చరించారు.

జగన్ అరాచకాలను జనం భరించలేక పోతున్నారు - గోనుగుంట్ల కోటేశ్వరరావు, తెదేపా నేత
దుర్మార్గంగా తమపై, ప్రజలపై దాడి చేసి ఎంతోకాలం బెదిరించలేరని తెదేపా నేత గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయి, హెరాయిన్, మత్తు పదార్థాలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ రెడ్డి పచ్చి మోసగాడని, ఆయన చేసే అరాచకాలను ఎవరూ భరించలేక పోతున్నారని గోనుగుంట్ల కోటేశ్వరరావు మండిపడ్డారు.

కాలగర్భంలో కలిసిపోతారు -రావుల వెంకయ్య, అఖిల భారత కిసాన్ మహాసభ అధ్యక్షుడు
చంద్రబాబు దీక్షకు అఖిల భారత కిసాన్ మహాసభ అధ్యక్షుడు రావుల వెంకయ్య సంఘీభావం తెలిపారు. రైతు సంఘాలు చంద్రబాబుకు బాసటగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు అత్యంత హేయమైనవన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్లు ప్రతీకారం తీర్చుకుంటామని మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. వైకాపా నేతలు ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రం మొత్తం తీసుకురావాలని చూస్తున్నారని మండిపడ్డారు. నియంతలు కాలగర్భంలో కలిసినట్టు జగన్ కూడా కాలగర్భంలో కలిసిపోతాడని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లో రైతులపై దాడి చేసిన అజయ్ మిశ్రాలా జగన్ కూడా రైతులపై దాడులు చేయాలని చూస్తే కాలగర్భంలో కలిసిపోతావని హెచ్చరించారు.


ఇదీ చదవండి : ఎలక్షన్ కోడ్ పై ఈసీ కీలక ప్రకటన.. మారిన నియమావళి!

ముఖ్యమంత్రి జగన్ పై తెదేపా నేతలు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచర పాలన నడుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపితే.. అక్రమ కేసులు పెడుతున్నారన్న నేతలు.. జగన్ చేయించే దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. బాబు దీక్ష చేపట్టిన మంగళగిరిలోని తెదేపా కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు దీక్షా స్థలి వద్ద, మీడియా సమావేశాల్లో ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు.

అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తరిమి కొడతాం -దేవినేని ఉమా, మాజీ మంత్రి
రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామ ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ రెడ్డి పాలనలో అరాచకత్వం రాజ్యమేలుతోందన్నారు. పట్టాభి ఇంటిపై దాడి చేశారు, పార్టీ కార్యాలయంపై గంజాయి బ్యాచ్ తో దాడి చేశారు. దాడులు చేస్తే భయపడబోమని స్పష్టం చేశారు. మంత్రులు బరితెగించి బూతులు తిడుతున్నారన్న ఆయన.. అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తరిమి కొడతామని పేర్కొన్నారు. 11 సీబీఐ, 6 ఈడీ, 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్నది జగన్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి మాట్లాడితే వాటిని పక్కదారి పట్టించడానికి దాడులు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోప్రజాస్వామ్యానికి దెబ్బతగిలింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలన్నారు.

పచ్చడి అయిపోతారు -పీతల సుజాత, మాజీ మంత్రి
వైకాపా వచ్చాక రాష్ట్రం.. డ్రగ్స్, శాండ్, మైన్, లిక్కర్ మాఫియాకు కేంద్రంగా మారిందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి పోలీసులు అంటకాగుతున్నారని విమర్శించారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు దీక్ష చేస్తున్నారని తెలిపారు. కేసులు నుండి తప్పించుకోవడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసం పోరాడే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పులు చూపెడితే.. అక్రమ కేసులు పెడుతున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాయకులకు బీపీలు వస్తే కొడతారు.. మా నాయకులు మాములుగా వస్తేనే పచ్చడి అయిపోతారని హెచ్చరించారు.

ఆటవిక పాలనా..? ప్రజాస్వామ్యమా..? - గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు
దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మానవ హక్కులను హరిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. ఆటవిక పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ ఉగ్రవాదంగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో, బయట వైకాపా నేతలు చంద్రబాబుని తిట్టిన తిట్లేంటని నిలదీశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును తుపాకీతో కాల్చాలని, ఉరితీయాలని, ముఖ్యకంత్రీ అని జగన్ రెడ్డి అనలేదా? అని గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిలదీశారు.

ఇదీ చదవండి : చంద్రబాబుకు సీపీఐ నారాయణ ఫోన్.. ఏమన్నారంటే?

దాడులకు భయపడే వారు ఎవరూ లేరు - ఆచంట సునీత, అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు
అవినీతి, అరాచకపు వ్యక్తి ముఖ్యమంత్రయితే రాష్ట్రం ఎలా ఉంటుందో జగన్ పాలనే ఉదాహరణ అని అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్ష్యురాలు ఆచంట సునీత అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని, తప్పుల్ని ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. మీ దాడులకు భయపడే వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చితే జగన్ రెడ్డి, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. తెదేపా అధికారంలో ఉన్నపుడు మేం మీలా వ్యవహరిస్తే జగన్ , షర్మిల పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. వైకాపా ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం చేసే అరాచకం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్న ఆమె.. 151 మంది ఎమ్మెల్యేలు ఒక్కో రాజారెడ్డి లాగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

వైకాపా వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలి - దివ్యవాణి, తెదేపా అధికార ప్రతినిధి
ఇసుక కొరతతో రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ ప్రక్క రాష్ట్రాలకు పారిపోతున్నారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. యువకులకు ఉద్యోగాలు లేవు, రోడ్లు సరిగా లేవని మండిపడ్డారు. ఒక్కసారి ఛాన్స్ తో వచ్చి ప్రజలను మోసం చేసినందుకు, అమరావతి రైతులను రోడ్లపై కూర్చోబెట్టినందుకు జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ ఆధార్ లు చించుతామన్న వైకాపా వాళ్లు.. నాలుకలు అదుపులో పెట్టుకోవాలని దివ్యవాణి హెచ్చరించారు.

జగన్ అరాచకాలను జనం భరించలేక పోతున్నారు - గోనుగుంట్ల కోటేశ్వరరావు, తెదేపా నేత
దుర్మార్గంగా తమపై, ప్రజలపై దాడి చేసి ఎంతోకాలం బెదిరించలేరని తెదేపా నేత గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయి, హెరాయిన్, మత్తు పదార్థాలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ రెడ్డి పచ్చి మోసగాడని, ఆయన చేసే అరాచకాలను ఎవరూ భరించలేక పోతున్నారని గోనుగుంట్ల కోటేశ్వరరావు మండిపడ్డారు.

కాలగర్భంలో కలిసిపోతారు -రావుల వెంకయ్య, అఖిల భారత కిసాన్ మహాసభ అధ్యక్షుడు
చంద్రబాబు దీక్షకు అఖిల భారత కిసాన్ మహాసభ అధ్యక్షుడు రావుల వెంకయ్య సంఘీభావం తెలిపారు. రైతు సంఘాలు చంద్రబాబుకు బాసటగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు అత్యంత హేయమైనవన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్లు ప్రతీకారం తీర్చుకుంటామని మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. వైకాపా నేతలు ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రం మొత్తం తీసుకురావాలని చూస్తున్నారని మండిపడ్డారు. నియంతలు కాలగర్భంలో కలిసినట్టు జగన్ కూడా కాలగర్భంలో కలిసిపోతాడని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లో రైతులపై దాడి చేసిన అజయ్ మిశ్రాలా జగన్ కూడా రైతులపై దాడులు చేయాలని చూస్తే కాలగర్భంలో కలిసిపోతావని హెచ్చరించారు.


ఇదీ చదవండి : ఎలక్షన్ కోడ్ పై ఈసీ కీలక ప్రకటన.. మారిన నియమావళి!

Last Updated : Oct 22, 2021, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.