ETV Bharat / city

మంత్రి పేర్ని నాని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: లోకేశ్

author img

By

Published : May 5, 2021, 10:27 PM IST

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు సరైన వైద్యం అందించలేని ప్రభుత్వం.. ప్రజలను నిందించడం దారుణమని అన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

tdp leader nara lokesh fire on ycp government about corona treatment
తెదేపా నేత నారాలోకేశ్
  • కరోనా పై కనీస అవగాహన లేకుండా సీఎం @ysjagan, సహచర మంత్రి వర్గం దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కరోనా కి చికిత్స అందించడం చేతగాక చేతులెత్తేసిన ప్రభుత్వం ప్రజల్ని నిందించడం దారుణం.(1/4) pic.twitter.com/pyOhdhAf4I

    — Lokesh Nara (@naralokesh) May 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా బాధితులకు చికిత్స అందించకుండా చేతులెత్తేసిన ప్రభుత్వం.. ప్రజలను నిందించటం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సీఎం జగన్, మంత్రులు వైరస్​పై కనీస అవగాహన లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పడకలు, ఆక్సిజన్, మందులు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని లోకేశ్ ఆరోపించారు.

కదిరి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్, కనీస సౌకర్యాలు లేక కొవిడ్ బాధితులు మృతి చెందారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కించపరుస్తూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేశ్ తన ట్విట్టర్​కు జత చేశారు.

ఇదీచదవండి.

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు

  • కరోనా పై కనీస అవగాహన లేకుండా సీఎం @ysjagan, సహచర మంత్రి వర్గం దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కరోనా కి చికిత్స అందించడం చేతగాక చేతులెత్తేసిన ప్రభుత్వం ప్రజల్ని నిందించడం దారుణం.(1/4) pic.twitter.com/pyOhdhAf4I

    — Lokesh Nara (@naralokesh) May 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా బాధితులకు చికిత్స అందించకుండా చేతులెత్తేసిన ప్రభుత్వం.. ప్రజలను నిందించటం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సీఎం జగన్, మంత్రులు వైరస్​పై కనీస అవగాహన లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పడకలు, ఆక్సిజన్, మందులు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని లోకేశ్ ఆరోపించారు.

కదిరి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్, కనీస సౌకర్యాలు లేక కొవిడ్ బాధితులు మృతి చెందారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కించపరుస్తూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేశ్ తన ట్విట్టర్​కు జత చేశారు.

ఇదీచదవండి.

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.