ETV Bharat / city

రంగులు తొలగించకుండా తప్పు చేశారు:సుప్రీంకోర్టు

author img

By

Published : Jun 3, 2020, 12:01 PM IST

Updated : Jun 3, 2020, 2:12 PM IST

supreme-court-
supreme-court-

12:00 June 03

రంగులు తొలగించకుండా తప్పు చేశారు: సుప్రీంకోర్టు

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైకాపా సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం... కార్యాలయాలకు వేసిన రంగులను 4 వారాల్లో తొలగించాలని ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. జీవో 623పై ఏపీ హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉందని సమర్థించింది. హైకోర్టు తీర్పు తర్వాత రంగులు తొలగించకుండా తప్పు చేశారని పేర్కొంది. మళ్లీ వేరే రంగు జతచేసి జీవో ఎందుకు తెచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అన్ని వాదనలతో కలిపి రెండు పేజీల తీర్పు ఇచ్చింది.

హైకోర్టు ఏం చెప్పిందంటే...

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల జీవోను మే 22న హైకోర్టు కొట్టివేసింది.  విచారణ సందర్భంగా .. ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు అదనంగా వేసేది పార్టీ రంగు కాదని...ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. సుప్రీంకోర్టు, ఉన్నతన్యాయస్థానం మార్గదర్శకాలను పాటించలేదని న్యాయస్థానం తెలిపింది. ఈ అంశాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా తీసుకుంటామని స్పష్టం చేసింది.

 ‘పంచాయతీ కార్యాలయాలకు వేసేందుకు ఇచ్చిన జీవోలో పేర్కొన్న 4 రంగుల్లో ఆకుపచ్చ, నీలం, తెలుపు వైకాపా జెండాను ప్రతిబింబిస్తున్నాయనడంలో సందేహం లేదు. అధికారులు ఆ రంగులు పాడిపంటలకు సంబంధించినవంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాజకీయ పార్టీ రంగులు వేయకుండా ఉండేందుకు అధికారులు శ్రద్ధ పెట్టలేదు.4రంగులేయాలని నిర్ణయించిన కమిటీ బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు కనిపించడం లేదు. గత తీర్పును పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను దాటవేయడానికి వీల్లేదు. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా వారి జెండా రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం పరిపాటిగా మారిందని, ఆ విధానానికి స్వస్తి పలకాలని స్పష్టమైన తీర్పు ఇచ్చాం. దానిపై సదుద్దేశం లేకనే మరోమారు వైకాపా జెండా రంగులే వేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైకాపా రంగులేయొద్దన్న మా తీర్పును సుప్రీంకోర్టూ సమర్థించింది. ఆ నిర్ణయాన్ని విస్మరించి ఎర్రమట్టి రంగును చేర్చి ప్రభుత్వం తన ఉద్దేశాన్ని పరోక్షంగా నెరవేర్చుకునేందుకు జీవో ఇచ్చింది’ -  రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం

ఇదీ చదవండి:

ప్రభుత్వానికి షాక్..కార్యాలయాలకు రంగుల జీవో రద్దు

12:00 June 03

రంగులు తొలగించకుండా తప్పు చేశారు: సుప్రీంకోర్టు

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైకాపా సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం... కార్యాలయాలకు వేసిన రంగులను 4 వారాల్లో తొలగించాలని ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. జీవో 623పై ఏపీ హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉందని సమర్థించింది. హైకోర్టు తీర్పు తర్వాత రంగులు తొలగించకుండా తప్పు చేశారని పేర్కొంది. మళ్లీ వేరే రంగు జతచేసి జీవో ఎందుకు తెచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అన్ని వాదనలతో కలిపి రెండు పేజీల తీర్పు ఇచ్చింది.

హైకోర్టు ఏం చెప్పిందంటే...

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల జీవోను మే 22న హైకోర్టు కొట్టివేసింది.  విచారణ సందర్భంగా .. ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు అదనంగా వేసేది పార్టీ రంగు కాదని...ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. సుప్రీంకోర్టు, ఉన్నతన్యాయస్థానం మార్గదర్శకాలను పాటించలేదని న్యాయస్థానం తెలిపింది. ఈ అంశాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా తీసుకుంటామని స్పష్టం చేసింది.

 ‘పంచాయతీ కార్యాలయాలకు వేసేందుకు ఇచ్చిన జీవోలో పేర్కొన్న 4 రంగుల్లో ఆకుపచ్చ, నీలం, తెలుపు వైకాపా జెండాను ప్రతిబింబిస్తున్నాయనడంలో సందేహం లేదు. అధికారులు ఆ రంగులు పాడిపంటలకు సంబంధించినవంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాజకీయ పార్టీ రంగులు వేయకుండా ఉండేందుకు అధికారులు శ్రద్ధ పెట్టలేదు.4రంగులేయాలని నిర్ణయించిన కమిటీ బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు కనిపించడం లేదు. గత తీర్పును పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను దాటవేయడానికి వీల్లేదు. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా వారి జెండా రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం పరిపాటిగా మారిందని, ఆ విధానానికి స్వస్తి పలకాలని స్పష్టమైన తీర్పు ఇచ్చాం. దానిపై సదుద్దేశం లేకనే మరోమారు వైకాపా జెండా రంగులే వేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైకాపా రంగులేయొద్దన్న మా తీర్పును సుప్రీంకోర్టూ సమర్థించింది. ఆ నిర్ణయాన్ని విస్మరించి ఎర్రమట్టి రంగును చేర్చి ప్రభుత్వం తన ఉద్దేశాన్ని పరోక్షంగా నెరవేర్చుకునేందుకు జీవో ఇచ్చింది’ -  రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం

ఇదీ చదవండి:

ప్రభుత్వానికి షాక్..కార్యాలయాలకు రంగుల జీవో రద్దు

Last Updated : Jun 3, 2020, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.