రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానితులకు సంబంధించిన నమూనాలు తక్కువగా సేకరిస్తున్నామన్న అంశం వాస్తవం కాదని వైద్యారోగ్యశాఖ రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి డాక్టర్ కె.రాంబాబు అన్నారు. ముందుగా కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రోటో కాల్ ప్రకారం చైనా నుంచి తిరిగివచ్చిన వారి నమూనాలు మాత్రమే తీసుకున్నామని.. ఆ తదుపరి మిగతా దేశాల నుంచి తిరిగి వచ్చిన వారివీ సేకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు వీడీఆర్ఎల్ ల్యాబ్లలో పూర్తిస్తాయిలో నమూనాల నిర్ధరణ జరుగుతోందని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎవరికి వారు స్వీయజాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని రాంబాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వీడియో విడుదల