ETV Bharat / city

'ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం'

ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకురావాలని చెప్పారు. అంతే కాకుండా పలు కీలక విషయాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

author img

By

Published : Nov 6, 2019, 5:59 PM IST

సీఎం జగన్

ఇసుక ధరలకు కళ్లెం వేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం జగన్​ నిర్ణయించారు. ఈలోగా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరా పెంపుపై తాడేపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి, గనులశాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధర నిర్ణయించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఎంత రేటు ఉండాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించాలని దిశానిర్దేశం చేశారు. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకురావాలని సీఎం చెప్పారు. ఇసుక రేటు నిర్ణయించాకే ధరలను ప్రకటించాలని సీఎం స్పష్టం చేశారు. నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలని సూచించారు.

ఇసుక రీచ్​ల్లో నిఘా నేత్రాలు

మరో 15 నుంచి 30 రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుకపై నిఘా పెంచాలని... మొత్తం 275 రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జగన్​ ఆదేశించారు. మైనింగ్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షించాలని వివరించారు. ఈ నెలాఖరు నాటికి ఇసుక రీచ్‌ల వద్ద కెమెరాలు, వే బ్రిడ్జిలు ఏర్పాటుచేయాలని స్పష్టం చేశారు.

ఇసుక ధరలకు కళ్లెం వేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం జగన్​ నిర్ణయించారు. ఈలోగా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరా పెంపుపై తాడేపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి, గనులశాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధర నిర్ణయించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఎంత రేటు ఉండాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించాలని దిశానిర్దేశం చేశారు. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకురావాలని సీఎం చెప్పారు. ఇసుక రేటు నిర్ణయించాకే ధరలను ప్రకటించాలని సీఎం స్పష్టం చేశారు. నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలని సూచించారు.

ఇసుక రీచ్​ల్లో నిఘా నేత్రాలు

మరో 15 నుంచి 30 రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుకపై నిఘా పెంచాలని... మొత్తం 275 రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జగన్​ ఆదేశించారు. మైనింగ్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షించాలని వివరించారు. ఈ నెలాఖరు నాటికి ఇసుక రీచ్‌ల వద్ద కెమెరాలు, వే బ్రిడ్జిలు ఏర్పాటుచేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

పోలవరం పనుల పర్యవేక్షణకు కాళేశ్వరం ఇంజినీరింగ్​ నిపుణులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.