నివర్ తుపాను నేపథ్యంలో వాయిదా పడిన ఆర్జీయూకేటీ సెట్ను నేడు నిర్వహించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ డి.హరినారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 630, తెలంగాణలో 8 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఇవాళే ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తామని.. ఏవైనా అభ్యంతరాలుంటే 7వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు. 8న తుది ‘కీ’ విడుదల చేసి, 12న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఈ పరీక్షకు 48,422 మంది బాలురు, 40,550 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: