ETV Bharat / city

Heavy Temperatures: తెలంగాణలో భానుడి భగభగ... బయటికి రాని జనం - Telangana Latest News

Heavy Temperatures: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. 40 నుంచి 42 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సెగలుకక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. భానుడి భగభగలకు జీవజాతులు అల్లాడిపోతున్నాయి. వారం రోజుల తరవాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు వడగాల్పుల తీవ్రత ఉంటుందని చెబుతున్నారు.

Heavy Temperatures  in telangana
తెలంగాణలో భానుడి భగభగ
author img

By

Published : Mar 17, 2022, 4:39 PM IST

Heavy Temperatures: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. పగటి వేళల్లో భానుడి తాకిడికి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు. దీంతో పగటివేళల్లో రహాదారులన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతల పానీయాలు సేవిస్తూ, చెట్ల నీడన సేదతీరుతున్నారు.

నల్గొండలో అత్యధికం...

బుధవారం పగలు రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా నల్గొండలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 5 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. రాగల మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 5 రోజుల తరువాత వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు.

బయట తిరగకండి...

వేడికి గాలిలో తేమ అసాధారణ స్థాయిలో తగ్గి పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోత అధికమవుతోంది ఎండతీవ్రత అధికంగా ఉండే సమయంలో వృద్ధులు, చిన్న పిల్లలు బయట తిరగకూడదని వైద్యులు సూచించారు. పిల్లలకు వడదెబ్బ తగలడంతో పాటు చర్మవ్యాధులు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గొడుగుతో పాట గ్లూకోజ్‌ నీళ్లు, నిమ్మరసం, మజ్టిగ, కొబ్బరి నీళ్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు చెట్ల నీడలో సేద తీరాలని చెబుతున్నారు.

ఇదీ చదవండి: మత్స్యకారుల జీవన విధానాన్ని ఒక్క జీవోతో నాశనం చేస్తున్నారు: కొల్లు రవీంద్ర

Heavy Temperatures: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. పగటి వేళల్లో భానుడి తాకిడికి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు. దీంతో పగటివేళల్లో రహాదారులన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతల పానీయాలు సేవిస్తూ, చెట్ల నీడన సేదతీరుతున్నారు.

నల్గొండలో అత్యధికం...

బుధవారం పగలు రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా నల్గొండలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 5 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. రాగల మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 5 రోజుల తరువాత వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు.

బయట తిరగకండి...

వేడికి గాలిలో తేమ అసాధారణ స్థాయిలో తగ్గి పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోత అధికమవుతోంది ఎండతీవ్రత అధికంగా ఉండే సమయంలో వృద్ధులు, చిన్న పిల్లలు బయట తిరగకూడదని వైద్యులు సూచించారు. పిల్లలకు వడదెబ్బ తగలడంతో పాటు చర్మవ్యాధులు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గొడుగుతో పాట గ్లూకోజ్‌ నీళ్లు, నిమ్మరసం, మజ్టిగ, కొబ్బరి నీళ్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు చెట్ల నీడలో సేద తీరాలని చెబుతున్నారు.

ఇదీ చదవండి: మత్స్యకారుల జీవన విధానాన్ని ఒక్క జీవోతో నాశనం చేస్తున్నారు: కొల్లు రవీంద్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.