వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్, వైఎస్సార్ ఎచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 13న నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి: