ETV Bharat / city

భార్గవరామ్‌.. గుంటూరు శ్రీను ఎక్కడ?

బోయినపల్లి కిడ్నాప్​ కేసులో నిందితుల ఆచూకీని పోలీసులు ఇంకా గుర్తించలేక పోయారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్న ఉన్నతాధికారులు.. నెల దాటినా వారిని అదుపులోకి తీసుకోలేదు. నిందితులను పట్టుకోవడంలో బృందాల మధ్య పరస్పరం సహకారం లేకపోవడం వల్లనే.. వారి ఆచూకీ తెలియడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

author img

By

Published : Feb 9, 2021, 4:32 PM IST

police investigation going slow to findout accused in boinapalli kidnap case
బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారంలో నిందితులను పట్టుకోవడంలో ఆలస్యం చేస్తున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో.. పోలీసుల పట్టు క్రమంగా సడలుతోంది. నిందితులందరినీ నాలుగైదు రోజుల్లో అరెస్టు చేస్తామంటూ పోలీసు‌ ఉన్నతాధికారులు నాడు ప్రకటించారు. ఈ కేసులో ప్రథమ ముద్దాయి మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె ఆదేశాలను పాటించిన వారిని మినహా.. సూత్రధారులు భార్గవరామ్, గుంటూరు శ్రీను, పాత్రధారులైన భార్గవరామ్‌ తల్లి కిరణ్మయి, భూమా అఖిల ప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డిలను పోలీసులు పట్టుకోలేదు. భార్గవ రామ్, శ్రీనులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్న ఉన్నతాధికారులు.. నెల దాటినా వారి ఆచూకీని గుర్తించలేకపోయారు. వీరిద్దరితో పాటు పారిపోయిన నిందితులు సైతం.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి సురక్షితంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

బృందాల మధ్య విభేదాలు!

అఖిలప్రియ భర్త భార్గవరామ్, గుంటూరు శ్రీనులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల్లోని సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని తెలిసింది. ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ అనంతరం నిందితులను పట్టుకున్నప్పుడు.. తామే అంతా చేశామంటూ రెండు ప్రత్యేక బృందాల్లోని సభ్యులు ఉన్నతాధికారులకు చెప్పుకొని అభినందనలు అందుకున్నారు. అఖిల ప్రియ ఆచూకీతో సహా ఆమె అనుచరులు ఎక్కడున్నారన్న విషయాన్ని తెలుసుకుని పట్టుకున్నామని.. పేరు మాత్రం వేరే వారికి వచ్చిందని మరో బృందం సభ్యులు భావించారు. అప్పటి నుంచి ఇతర నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలు సమాచారం సేకరిస్తున్నా.. పరస్పరం సహకరించుకోవడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.

‘సరి’ చేసుకున్నారా?

ఈ కిడ్నాప్‌ కేసులో నిందితులుగా ఉన్న కొందరు వ్యక్తులు.. తమను అరెస్టు చేయకుండా సమీకరణాలను ‘సరి’ చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా ఇస్తాం, దర్యాప్తు ప్రక్రియలో సహకరిస్తాం అంటూ పోలీసులకు చెప్పిన ఆ వ్యక్తులు.. అఖిల ప్రియ అరెస్టు అనంతర పరిణామాలను పరిశీలించి జైలుకు వెళ్లడం శ్రేయస్కరం కాదనుకున్నట్లు సమాచారం. పక్క రాష్ట్రంలోని పోలీసులతో సంబంధాలున్న వారు.. హైదరాబాద్‌లో ప్రభావం చూపించే వారితో ‘మాట్లాడుకున్నట్లు’ తెలిసింది. మరికొందరు నిందితుల గురించి తామే సమాచారం చెబుతామని.. ఇందుకు ప్రతిగా పోలీసు‌ విభాగం తమకు సహకరించాలంటూ వారు అభ్యర్థించినట్లు సమాచారం. దీంతో సదరు వ్యక్తులు పోలీసు ‘గురి’ నుంచి తప్పించుకున్నారని తెలిసింది.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు 2021: పోలింగ్ పూర్తి.. కౌంటింగ్ షురూ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో.. పోలీసుల పట్టు క్రమంగా సడలుతోంది. నిందితులందరినీ నాలుగైదు రోజుల్లో అరెస్టు చేస్తామంటూ పోలీసు‌ ఉన్నతాధికారులు నాడు ప్రకటించారు. ఈ కేసులో ప్రథమ ముద్దాయి మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె ఆదేశాలను పాటించిన వారిని మినహా.. సూత్రధారులు భార్గవరామ్, గుంటూరు శ్రీను, పాత్రధారులైన భార్గవరామ్‌ తల్లి కిరణ్మయి, భూమా అఖిల ప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డిలను పోలీసులు పట్టుకోలేదు. భార్గవ రామ్, శ్రీనులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్న ఉన్నతాధికారులు.. నెల దాటినా వారి ఆచూకీని గుర్తించలేకపోయారు. వీరిద్దరితో పాటు పారిపోయిన నిందితులు సైతం.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి సురక్షితంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

బృందాల మధ్య విభేదాలు!

అఖిలప్రియ భర్త భార్గవరామ్, గుంటూరు శ్రీనులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల్లోని సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని తెలిసింది. ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ అనంతరం నిందితులను పట్టుకున్నప్పుడు.. తామే అంతా చేశామంటూ రెండు ప్రత్యేక బృందాల్లోని సభ్యులు ఉన్నతాధికారులకు చెప్పుకొని అభినందనలు అందుకున్నారు. అఖిల ప్రియ ఆచూకీతో సహా ఆమె అనుచరులు ఎక్కడున్నారన్న విషయాన్ని తెలుసుకుని పట్టుకున్నామని.. పేరు మాత్రం వేరే వారికి వచ్చిందని మరో బృందం సభ్యులు భావించారు. అప్పటి నుంచి ఇతర నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలు సమాచారం సేకరిస్తున్నా.. పరస్పరం సహకరించుకోవడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.

‘సరి’ చేసుకున్నారా?

ఈ కిడ్నాప్‌ కేసులో నిందితులుగా ఉన్న కొందరు వ్యక్తులు.. తమను అరెస్టు చేయకుండా సమీకరణాలను ‘సరి’ చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా ఇస్తాం, దర్యాప్తు ప్రక్రియలో సహకరిస్తాం అంటూ పోలీసులకు చెప్పిన ఆ వ్యక్తులు.. అఖిల ప్రియ అరెస్టు అనంతర పరిణామాలను పరిశీలించి జైలుకు వెళ్లడం శ్రేయస్కరం కాదనుకున్నట్లు సమాచారం. పక్క రాష్ట్రంలోని పోలీసులతో సంబంధాలున్న వారు.. హైదరాబాద్‌లో ప్రభావం చూపించే వారితో ‘మాట్లాడుకున్నట్లు’ తెలిసింది. మరికొందరు నిందితుల గురించి తామే సమాచారం చెబుతామని.. ఇందుకు ప్రతిగా పోలీసు‌ విభాగం తమకు సహకరించాలంటూ వారు అభ్యర్థించినట్లు సమాచారం. దీంతో సదరు వ్యక్తులు పోలీసు ‘గురి’ నుంచి తప్పించుకున్నారని తెలిసింది.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు 2021: పోలింగ్ పూర్తి.. కౌంటింగ్ షురూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.